ముఖ్యమంత్రి సహాయనిధికి కోవిడ్ విరాళాలపై నెలకొన్న వివాదం…వివరణ..
కార్పోరేట్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఫండ్స్ కింద పరిగణించబోమని కేంద్ర కార్పోరేట్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి సహాయని నిధి, లేదా కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ పేరిట ఏర్పాటు చేసిన ఫండ్స్ లో విరాళాలు ఇస్తే వాటిని కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఫండ్స్ కింద (CSR)చూసే వీలు లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ పేరిట సేకరిస్తున్న పీఎం కేర్స్ ఫండ్ కింద సేకరించే విరాళాలను CSR కింద పరిగణిస్తామని తెలిపింది. అయితే ఇప్పటికే పలు కార్పోరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు అందజేశాయి. అయితే వాటిని CSR కింద జమ చేయమని కోరగా కేంద్ర కార్పోరేట్ ఎఫైర్స్ శాఖ కుదరదని తేల్చి చెప్పింది. దీనికి సాంకేతిక పరమైన ఆడ్డంకులు ఉన్నాయని పేర్కొంది.
అందులో ప్రధానంగా కంపెనీల బిల్లు 2012 జూలై 8 న పార్లమెంట్ ఆమోదించింది, 2013 జూలై 29 న రాష్ట్రపతి అనుమతి ఇవ్వగా, కంపెనీల చట్టం 2013 అమల్లోకి వచ్చింది. CSR తో వ్యవహరించే షెడ్యూల్ VIIతో సహా ఈ చట్టం సెక్షన్ 135, ఏప్రిల్ 1, 2014 నుండి అమలులోకి వచ్చింది, ఇక ఫిబ్రవరి 27, 2014 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం షెడ్యూల్ VII ను సవరించింది. CSR విరాళాలను స్వీకరించడానికి అర్హత ఉన్న నిధులకు సంబంధించినది. సవరించిన షెడ్యూల్ VII ప్రకారం, ‘అర్హతగల నిధులకు’ సంబంధించిన అంశంలో ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ (పిఎంఆర్ఎఫ్) దానిలో పేర్కొన్న ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇతర ఫండ్లు మాత్రమే ఉన్నాయి. దీని ప్రకారం, సవరించిన షెడ్యూల్ VII లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఫండ్స్ తొలగించారు.