Leading News Portal in Telugu

కృష్ణా జిల్లా వైన్ షాపులో చోరీ.. మందు బాబుల పనే..?

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలో వైన్ షాపులో దొంగతనం జరిగింది. పెనమలూరు మండలం వణుకూరు వైన్ షాపు నుంచి మందు బాటిళ్లను దొంగతనం చేశారు. రాత్రి సమయంలో వైన్ షాప్ వెనక భాగం నుండి కిటికీ బద్దలు కొట్టుకుని లోపలికి చొరబడిన దొంగలు.. సుమారు 85 మద్యం బాటిల్స్‌ను చోరీ చేసినట్లు వెల్లడించారు. వీటి విలువ రూ.లక్షా50వేలు ఉంటుందని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ చోరీ మందుబాబులే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.