భర్తకు తెలియకుండా సొంతింట్లోనే ఆ పని చేసిన భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఓ మహిళ తన భర్తకు తెలియకుండా సొంతింట్లోనే దోపిడీకి పాల్పడిన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడిలోని తాలముత్తునగర్ సమీపంలోని పెరియసెల్వం నగర్కు చెందిన విన్సెంట్ అనే వ్యక్తి తన భార్య ఝాన్సీతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు కాగా, ఇద్దరికీ వివాహం చేశారు. ఒక కూతురు తూత్తుకుడిలో, మరో కూతురు పుదుచ్చేరిలో ఉంటున్నారు. విన్సెంట్ తూత్తుకుడి హార్బర్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే గురువారం రాత్రి విన్సెంట్ ఇంటిలో 100 సవర్ల బంగారు నగలు, రూ.20వేలు చోరికీ గురయ్యాయి. దీంతో విన్సెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేసే క్రమంలో విన్సెంట్ భార్య పోలీసులు అడిగే ప్రశ్నలకు పొంతన లేని సమాధానం చెబుతోంది. దీంతో ఝాన్సీని తీసుకెళ్లి విచారణ చేసి అసలు విషయాన్ని రాబట్టారు. రూ.20వేల నగదు, వంద సవర్ల నగలు చోరీ చేసినట్టుగా ఝాన్సీ ఒప్పుకుంది. పోలీసులు ఝాన్సీని శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు.