హైదరాబాద్ రాంనగర్లో క్షుద్రపూజల కలకలం… నిందితుడి అరెస్ట్
అసలే ఓ వైపు ప్రజలు కరోనా మహమ్మారి దెబ్బకు గజగజ వణికిపోతుంటే… హైదరాబాద్ రాంనగర్లో ఒక్కసారిగా క్షుద్రపూజల కలకలం రేగింది. స్థానికంగా ఓ పార్టీకి చెందిన నాయకుడు క్షుద్రపూజలు చేసి… ఆ వ్యర్థాలను వాటర్ ట్యాంక్లో వేసేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి చర్యలను గమనించిన కొందరు స్థానికులు… అతడిని ప్రశ్నించి నిర్బంధించారు. అతడిని ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు… ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.