కరోనా అంటూ మహిళా డాక్టర్లకు వేధింపులు… యువకుడి అరెస్ట్
ఓ వైపు కరోనా బాధితులు వైరస్ నుంచి విముక్తి పొందేందుకు డాక్టర్లు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేస్తుంటే… కొందరు మాత్రం వారి పట్ల అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీలోని గౌతమ్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సఫ్దర్ గంజ్ ఆస్పత్రికి చెందిన ఇద్దరు మహిళా డాక్టర్లు బుధవారం రాత్రి కూరగాయలు, పండ్లు కొనేందుకు సమీపంలోని మార్కెట్కు వెళ్లారు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు వారిని షాపుకు దూరంగా ఉండాలని అన్నాడు. వారు ఆస్పత్రి నుంచి వైరస్ నుంచి తీసుకొని ఇక్కడ వ్యాపింపజేస్తున్నారని ఆరోపించాడు. ఆ ఇద్దరికి అంతా దూరంగా ఉండాలని అన్నాడు.
దీనిపై ఆ ఇద్దరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరు మహిళా డాక్టర్లపై దాడి చేశాడు. వారిని వెనక్కి నెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై వారిద్దరూ, కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు… నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డాక్టర్ల విషయంలో ఈరకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.