కరోనా విలయతాండవంక్రైమ్ట్రెండింగ్బిజినెస్బిజినెస్ ఐడియాఅంతర్జాతీయంఆరోగ్యంటెక్నాలజీWin 1 Lakh – MC PRO Contest హోమ్ » న్యూస్ » క్రైమ్ ప్రాణాలు తీసిన స్టాక్ మార్కెట్ నష్టాలు..బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య..
కరోనా దెబ్బతో షేర్ మార్కెట్లు కనీ వినీ ఎరుగని రీతిలో నష్టపోయాయి. దీంతో మదుపరులు భారీగా నష్టపోయారు. కొందరి పోర్టు ఫోలియోలు అయితే 90 శాతం మేర నష్టపోయాయి. అయితే ఈ నష్టాల మార్కెట్ దెబ్బ తట్టుకోలేక ఓ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన బ్యాంకు ఉద్యోగి భారీగా నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఆర్య జిల్లాకు చెందిన 27 ఏళ్ళ అజయ్ బాబు రెండేళ్లుగా స్థానిక బ్యాంకులో క్షేత్రస్థాయి అధికారిగా పనిచేస్తున్నాడు. షేర్ మార్కెట్ ఇటీవల కాలంలో భారీగా కుప్పకూలడంతో 20 లక్షల వరకు నష్టపోయాడు. దీంతో మనస్థాపం చెందిన అజయ్ బాబు..బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్టాక్ మార్కెట్లో నష్టాల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకున్నానని, అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేశానని, వారికి తిరిగి డబ్బు చెల్లించలేనని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.