పగలంతా డ్రైవింగ్.. రాత్రిళ్లు కాలనీల్లో చోరీలు.. 72 తులాల బంగారం..
చేసేది డ్రైవింగ్ పని. రాత్రిళ్లు కాలనీల్లోని ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతుంటాడు. ఇలా ఏకంగా 72 తులాల బంగారం, రూ.4 లక్షల నగదు చోరీ చేశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కి కటకటలాపాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన పోలకి అప్పలనాయుడు(41) వృత్తిరీత్యా డ్రైవర్. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రాంతం కిస్మత్పూర్లో నివాసముంటున్నాడు. ఓవైపు డ్రైవింగ్ చేస్తూనే పగలంతా కారులో పలు కాలనీల్లో తిరుగుతూ రెక్కి నిర్వహించారు.
రాత్రి సమయంలో ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడేవాడు. ఇలా 1999-2012 మధ్య హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 18 ప్రాంతాల్లో, రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ నేరం చేసి జైలుకు సైతం వెళ్లివచ్చాడు. తర్వాత 2019- 2020 మార్చి వరకు రాచకొండకుచెందిన మీర్పేట పోలీసు స్టేషన్ పరిధిలోనే 24 వరస దొంగతనాలు చేశాడు. ఎల్బీనగర్ ఠాణా పరిధిలోనూ నేరం చేసిన దాఖాలాలు ఉన్నాయి. దీంతో అప్పలనాయుడు సాంకేతికత ఆధారంగా మీర్పేట పోలీసులు అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో వైద్య పరీక్షల తర్వాత రిమాండుకు తరలించనున్నట్టు తెలిపారు.