Leading News Portal in Telugu

Allari Naresh: ఆ హీరో కోసం రేటు తగ్గించి మరీ ఓకే చెప్పిన అల్లరోడు..?


Allari Naresh: అల్లరి నరేష్.. ప్రస్తుతం తన పేరు మీద ఉన్న అల్లరిని తొలగించడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒకప్పుడు ఆయన తండ్రి ఈవీవీ సత్యనారాయణ బతికిఉన్నప్పుడు.. కామెడీ సినిమాలతో హిట్లు అందుకున్న నరేష్.. ఆ తరువాత కామెడీ చేసినా కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. ఇక దీంతో నరేష్ రూట్ మార్చాడు. కొత్త జనరేషన్ వస్తున్న సమయంలో మనం కూడా మారాలి అనేది తెలుసుకున్న అల్లరోడు.. మంచి కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపద్యంలో హీరోగానే కాకుండా సపోర్టివ్ క్యారెక్టర్స్ లో కూడా మెరుస్తున్నాడు. ఇక ఈ మధ్యనే నరేష్ నటించిన ఉగ్రం.. ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా ఆడియన్స్ ను మెప్పించాలని నరేష్ డిసైడ్ అయ్యి.. డిఫరెంట్ డిఫరెంట్ కథలను ఎన్నుకుంటున్నాడని టాక్. అందులో భాగంగానే అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త సినిమా నా సామీ రంగా చిత్రంలో నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో హిట్ అందుకున్న పోరింజు మరియం జోస్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇందులో హీరో కాకుండా మరో పాత్ర చాలా కీలకమట. ఆ పాత్రనే నరేష్ ను ఎంపిక చేసారని తెలుస్తోంది.

Balagam: మరో గ్లోబల్ అవార్డుకు ఎంపికైన బలగం..

ఇక కథ నచ్చడంతో నరేష్ సపోర్టివ్ రోల్ అయినా చేస్తాను అని మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాడు. ఇప్పటికే గమ్యం, శంభో శివ శంభో, మహర్షి లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు నాగ్ సినిమాలో కూడా నరేష్ చేయడానికి రెడీ అయ్యాడట. అంతేకాకుండా నాగ్ కోసం తన రెమ్యూనిరేషన్ కూడా తగ్గించి మరీ ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథకు నరేష్ పాత్ర చాలా ముఖ్యమట.. అందుకే నరేష్ పారితోషికం గురించి ఆలోచించకుండా కథను నమ్మి ఓకే చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మేకర్స్ అధికారికంగా తెలపనున్నారు. ఇక ఈ సినిమా కాకుండా ప్రస్తుతం నరేష్ సభకు నమస్కారం అనే సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలతో నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.