Siggu: 1940 లో ఒక గ్రామం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీని మొత్తం తనవైపు తిప్పుకున్న దర్శకుడు నరసింహా నంది. ఈ సినిమాకు గాను ఆయన జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. ఆ తరువాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించినా.. ఆయనకు అంత గుర్తింపు దక్కలేదు. ఇక ఈ మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న నరసింహా నంది.. తాజాగా సిగ్గు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమాను భీమవరం టాకీస్ పతాకంపై రామ సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి జేడీ లక్ష్మీనారాయణ క్లాప్ ఇవ్వగా, కె. విజయేంద్ర ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వి వి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. సి. కళ్యాణ్, దామోదర ప్రసాద్ స్క్రిప్ట్ ను దర్శక నిర్మాతలకు అందించారు.
RGV: పవన్ కళ్యాణ్ నా పోస్టర్ ను కాపీ కొట్టాడు…
ఇక పూజ అనంతరం నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ “నేను చిత్ర పరిశ్రమకి వచ్చి ఖచ్చితంగా 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. మొదటి నుంచి నన్ను అభిమానించి అక్కున చేర్చుకున్న వ్యక్తి కళ్యాణ్ గారు. ఆయన సపోర్ట్తో ముందుకెళ్తున్నాను” అని అన్నారు. ఇక జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ “సామాజిక స్పృహ కలిగిన సినిమాలు తీయాలని సమాజాన్ని పాడు చేసే సినిమాలు తీయకూడదు అని నేను క్లాప్ కొట్టాను. కాబట్టి మంచి సినిమా తీయించే బాధ్యత ఈ బృందంపై ఉంది. ఆ నమ్మకంతోనే క్లాప్ కొట్టాను” అని చెప్పుకొచ్చారు.
Keerthy Suresh: మహానటి బాలీవుడ్ ఎంట్రీ.. సమంత హీరోతో రొమాన్స్.. ?
దర్శకుడు నరసింహా నంది మాట్లాడుతూ “రామ సత్యనారాయణగారి బ్యానర్లో గతంలో కూడా పని చేశా. నాపై నమ్మకంతో ఆయన ఏరోజు కూడా సెట్లో అడుగుపెట్టరు. పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. ఆ నమ్మకంతోనే నాకు మళ్లీ అవకాశం ఇచ్చారు. చలం గారి నవల సుశీల ఆధారంగా ఈ సినిమా చేస్తున్నా. నాకు రెగ్యులర్ గా వర్క్ చేసే టీమ్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. నటీనటుల ఎంపిక పూర్తయిన తర్వాత ఇతర వివరాలు వెల్లడిస్తా” అన్నారు. మరి ఈ సినిమాతో ఈ టీమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.