సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాలో శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి మహేష్ బాబు సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నారు..ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.ఈ సినిమా పై ఇప్పటికే భారీగా అంచానాలు వున్నాయి.అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుందా లేదా అని అనుమానాలు వచ్చాయి. కానీ వాటికీ మేకర్స్ చెక్ పెట్టారు.షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది.
ఇక ఈ సినిమా విడుదలకు చాలా సమయం ఉన్న అప్పుడే బిజినెస్ భారీగా చేస్తున్నట్టు సమాచారం… ఎప్పటి నుండో ఈ సినిమాకు భారీ బిజినెస్ జరుగుతుందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తూనే ఉన్నాయి.అయితే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాకపోయినా ఈ సినిమా కోసం కూడా ఏకంగా 220 కోట్ల బడ్జెట్ పెట్టనున్నట్లు సమాచారం… అయితే ఈ బడ్జెట్ కు అనుగుణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది.. మహేష్, త్రివిక్రమ్ కు వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా బిజినెస్ స్థాయి కూడా పెరిగింది. తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు ప్రముఖ మ్యూజికల్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్టు సమాచారం..త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కూడా మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా గ్లింప్స్ వీడియో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో మహేష్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీ కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.