Leading News Portal in Telugu

Tripti Dimri : రెమ్యూనరేషన్ పెంచేసిన యానిమల్ బ్యూటీ..?



Tripthii

బాలీవుడ్ లో గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా యానిమల్.. ఈ సినిమాతో హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.. ఈ సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఈ అమ్మడు పై గాసిప్స్, ట్రోల్స్ ఆగడం లేదు.. దాంతో పాప ట్రెండింగ్ లో ఉంది.. సోషల్ మీడియాలో యమ క్రేజ్ ను సంపాదించుకుంది.. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది.. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి కీలకపాత్ర పోషించింది. సినిమాలో జోయా అనే పాత్రలో స్క్రీన్‌పై కనిపించింది కొద్ది సమయమే అయినప్పటికీ ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా రణ్‌బీర్‌ – త్రిప్తి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ అయ్యాయి.. యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. తాజాగా రెమ్యూనరేషన్ విషయంలో షాక్ ఇస్తుంది.. భారీగా రెమ్యూనరేషన్ ను పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. యానిమల్ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌తో ఇంటిమేట్‌ సీన్‌లో నటించి యూత్‌కు దగ్గరైంది త్రిప్తి. యానిమల్ సినిమాలో నటించినందుకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే పారితోషకం కింద ఇచ్చారట. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఆమె ఎవరో ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

ప్రస్తుతం ఈ అమ్మడు ఆమె ‘బుల్ బులయా 3’లో చిత్రంలో నటిస్తుంది. అందులో స్పెషల్ రోల్‌ నటిస్తున్నందుకు ఆమె కోటి రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటుందట. మేరే మెహబూబ్‌ మేరే సనమ్‌, విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాలతో బిజీగా ఉన్నారు.. అలాగే తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ మధ్య త్రిప్తి పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి.. ఈ రూమర్స్ పై స్పందించిన త్రిప్తి క్లారిటీ ఇచ్చింది.. ఇప్పటిలో పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేసింది .. ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్లో పెడుతుంది..