
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు ప్రస్తుతం అంతగా కలిసి రావడం లేదు.చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోతుంది.నితిన్ గతంలో చేసిన భీష్మ మూవీ సూపర్ హిట్ అయింది.ఇక ఆ మూవీ తరువాత ఆ రేంజ్ హిట్ నితిన్ కు లభించలేదు.రీసెంట్ గా నితిన్ నటించిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమా విడుదలకు ముందు ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ చేసింది .కానీ విడుదల తరువాత ఈ సినిమా ప్రేక్షకులని తీవ్రంగా నిరాశ పరిచింది. దీనితో నితిన్ తనకు గతంలో భీష్మ వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. నితిన్ ,వెంకీ కాంబినేషన్లో మరో సినిమా వస్తుందని తెలిసి నితిన్ అభిమానులు ఖుషి అవుతున్నారు.అయితే రీసెంట్ గా ఈ మూవీకి రాబిన్హుడ్ అనే టైటిల్ను ప్రకటిస్తూ గ్లింప్స్ వీడియోను కూడా షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట రష్మిక మందన్నా పేరు తెరపైకి రాగా.. ఆ తర్వాత శ్రీలీల పేరు బయటకు వచ్చింది. తాజాగా మరో భామ పేరు నెట్టింట వైరల్ అవుతుంది.రాబిన్హుడ్ మూవీ లో రాశీఖన్నాను ఓ ముఖ్య పాత్ర కోసం తీసుకున్నట్టు సమాచారం..అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇదే న్యూస్ కనుక నిజమైతే శ్రీనివాస కల్యాణం తర్వాత నితిన్, రాశీఖన్నా కాంబోలో వస్తున్నరెండో సినిమా కానుంది. దీనిపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం వుంది . నితిన్ రాబిన్హుడ్ మూవీ లో దొంగగా కనిపించబోతున్నట్టు గ్లింప్స్తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో నటకిరిటీ రాజేంద్రప్రసాద్ మరియు వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యేర్నేని మరియు రవి శంకర్ నిర్మి్స్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.