Leading News Portal in Telugu

Nayanathara: పిల్లల విషయంలో మరో వివాదంలో లేడీ సూపర్ స్టార్!


Nayanathara: పిల్లల విషయంలో మరో వివాదంలో లేడీ సూపర్ స్టార్!

Nayanathara News: సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల పెళ్లి వీడియో 25 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్‌కు అమ్ముడుపోవడం పెద్ద వార్త కాగా, ఇప్పుడు మరో విషయం గురించి ఆ జంట వార్తల్లోకి ఎక్కింది. నిజానికి నటి నయనతారకు వివాదాలు కొత్త కాదు, నయనతారను చాలా ఏళ్లుగా ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. శింబుతో లవ్ బ్రేక్ అప్ వివాదం, సరోగసీ వివాదం, గుడిలో చెప్పులు వేసుకోవడం వివాదం, సినిమా ప్రమోషన్ కు రాకపోవడం, అన్నపూర్ణై సినిమా వివాదం మొదలు ఆమె ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు, తమిళ సినీ నిర్మాత అనంతన్ నయనతార గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ సెట్‌కి ఏడెనిమిది మంది అసిస్టెంట్లను తీసుకువస్తే.. వాళ్లందరికీ నిర్మాత డబ్బులు చెల్లించాలని నయనతార గతంలో చెప్పిందని, నయనతార తన పిల్లలతో పాటు ఇద్దరు నానీలను సినిమా సెట్‌కి తీసుకువస్తుందని, ఇద్దరు నానీలకు నిర్మాతలు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేసినట్టు వెల్లడించాడు.

Maga Fans: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి బరిలో ఎవరు?

ఇది న్యాయమా? అని ప్రశ్నించిన ఆయన తన పిల్లలను చూసుకోవడానికి నానీలను తీసుకువస్తే, ఆమె వారికి డబ్బు ఇవ్వలేదా? నిర్మాతలు ఎందుకు చెల్లించాలి?’’ అని ప్రశ్నించారు. అంతే కాదు, నయనతార తన జీవితంలోని వ్యక్తిగత అంశాలతో డబ్బు ఆర్జించిందని అనంతన్ విమర్శించాడు, ఆమె తన సొంత వివాహ వీడియోను నెట్‌ఫ్లిక్స్‌కు భారీ మొత్తానికి విక్రయించిందని కూడా విమర్శించాడు. నయనతార అంతా వ్యాపారంగా మార్చేసిందని అన్నారు. కెరీర్‌లో చెప్పుకోదగ్గ గ్రోత్ సాధించినా.. ఇప్పుడు మాత్రం రివర్స్ గేర్‌లో కదులుతోందని అన్నాడు. ఇటీవల ఆయన నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అయినా ఆమె డిమాండ్లు తగ్గలేదని అనంతన్ పేర్కొన్నారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ మరియు నటి నయనతార చాలా సంవత్సరాలు డేటింగ్ చేసి రెండు సంవత్సరాల క్రితం భారతీయ చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వారి పెళ్లి వీడియోను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ 25 కోట్లకు కొనుగోలు చేసింది. ఒక గంట 21 నిమిషాల డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.