Leading News Portal in Telugu

కరోనాపై మాధవీ లత టిక్‌టాక్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్..

ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్ని కరోనా అనే మహామ్మారిపై పోరాడుతున్నాయి. ఈ వైరస్ పెద్దా, చిన్నా, బీదా, గొప్ప, ఆడా, మగ అనే తేడా తెలియకుండా అందరినీ కమ్మేస్తోంది. ఈ వైరస్ సోకిన తర్వాత సరైన చికిత్స తీసుకోకపోతే మరణాన్ని ఆహ్వానించినట్టే. ఇప్పటికే లక్షల మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ కరోనా కారణంగా కన్నుమూసారు. కొందరు సినిమా సెలబ్రిటీలకు కూడా ఈ వైరస్ సోకి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఈ వైరస్‌‌ను ఉద్దేశిస్తూ ప్రముఖ నటి మాధవి లత ఓ టిక్‌టాక్ వీడియోను రిలీజ్ చేసింది. జీవితంలో ఎన్ని సాధించినా.. చివరకు మనతో ఏది రాదనే సందేశం కరోనా ఇచ్చిందన్నారు. ఈ వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా అందరూ సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు.

మొదటి సంఖ్య నేను అని, ఫస్ట్ ప్లేస్ నాది అని, మొదటి నుంచి విర్రవీగే మొదటి రకం పొగరుబోతా.. భూమిపై స్థానం అంటూ ప్రాణమని తెలుసుకో… ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి అని ఆమె చెప్పిన తీరు పలువురు నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోను ఇప్పటి వరకు దాదపు 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దాదాపు 35 వేల మంది లైక్ చేసారు. ఒక్క నిమిషంలో జీవితం అంటే ఏమిటో తెలియచెప్పారు. మీ కవితా చాలా బాగుందని పలువురు నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.