జబర్దస్త్ షో నుంచి ఆ ఇద్దరు ఔట్.. హైపర్ ఆదికి షాక్..?
జబర్దస్త్ కామెడీ షోకు చాలా మంచి ఇమేజ్ ఉంది. ఇలాంటి కామెడీ షో రావడం వల్లే చాలా మంది నటులు ఇండస్ట్రీకి కూడా పరిచయం అయ్యారు. ఈ రోజు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి చాలా మంది కమెడియన్లు ఈ షో నుంచి ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇంకా ఎంతోమందికి జబర్దస్త్ కామెడీ షో అన్నం పెడుతుంది. ఇప్పటి వరకు కేవలం నవ్వులతోనే ఎక్కువగా పరిచయమున్న ఈ షో కొన్ని రోజులుగా కాంట్రవర్సీ కూడా అవుతుంది. ఇందులో నటించే ఇద్దరు కమెడియన్లు ఆ మధ్య వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు కూడా. హైపర్ ఆది టీంలో చేసే దొరబాబు, పరదేశీ వైజాగ్లోని ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు.
దాంతో మిగిలిన జబర్దస్త్ కమెడియన్లపై కూడా ఈ ప్రభావం పడేలా కనిపిస్తుంది. అందరిపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దొరబాబు, పరదేశీపై ఇప్పుడు మల్లెమాల టీం చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. వాళ్లకు వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా హైపర్ ఆది టీం ఈ ఇద్దరూ కనిపించారు కానీ ఇప్పుడు మాత్రం వీళ్లను బయటికి పంపే ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైపర్ ఆది టీంలో పరదేశీకి అంత క్రేజ్ లేదు కానీ దొరబాబు మాత్రం చాలా సీనియర్.. మంచి కమెడియన్ కూడా. అతడిపై ఎప్పుడూ అలాంటి జోకులే వస్తుంటాడు ఆది. ఇప్పుడు అదే నిజం చేసుకున్నాడు దొరబాబు.