
సాదారణంగా తలనొప్పి వస్తే జనాలు తట్టుకోవడం కష్టం అలాంటిది మైగ్రెన్ అంటే ఊహించడం కష్టం.. అంత ఎక్కువగా పెయిన్ ఉంటుంది.. ఏదో టాబ్లెట్ వేసిన కూడా కష్టమే తగ్గడం.. ఇక నిజానికి టీ, కాఫీ ల వల్ల తలనొప్పి తగ్గదు.. వాటిలో కెఫీన్ కారణంగా మనం కొంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. తలనొప్పినే భరించలేం కదాం. మరి మైగ్రేన్ పెయిన్ వస్తే? అది ఇంకా తీవ్రంగా ఉంటుంది. కనీసం రోజువారి పనులు కూడా చేసుకోలేనంత అవస్థ పెడుతుంది మైగ్రేన్. శరీరంలో విటమిన్ B లోపం కారణంగా మైగ్రేన్ వస్తుంది.
నిజానికి మైగ్రేన్ అంటే కుడి లేదా ఎడమవైపు తలనొప్పి రావడం. ఒక్కోసారి దీని కారణంగా.. తలలోని నరాలు బలహీనపడి ఆలోచనాశక్తి కూడా తగ్గిపోతుంటుంది. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ.. మైగ్రేన్ బాధితులున్నారు. కానీ పురుషుల్లో కంటే.. స్త్రీలలోనే మైగ్రేన్ తో బాధపడుతున్నవారు అధికంగా ఉంటున్నారు.. పనిలో ఒత్తిడి, సరిగ్గా ఆహారాన్ని తీసుకోకపోవడం,తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు. వాటికి తోడు ఎన్నో రకాల ఆలోచనలు, చిన్నచిన్న విషయాలకే ఆందోళన చెందడం కూడా మైగ్రేన్ కు కారణాలు. వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.. అప్పుడే మెదడు పై ఒత్తిడి పడకుండా తల నొప్పికి గురికాకుండా ఉంటారు..
శరీరంలో మెటబాలిజం ప్రక్రియలో విటమిన్ B ముఖ్యపాత్ర పోషిస్తుంది. కార్బోహైడ్రేట్లు, కొవ్వుల నుంచి శక్తిని ఉత్పత్తి చేయడం, ఆ శక్తిని శరీర అవయవాలు వినియోగించుకోవడానికి విటమిన్ B పనిచేస్తుంది. నిద్రలేమి, ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, అలసట కారణంగా మైగ్రెన్ వస్తుందని నిపుణులు అంటున్నారు..శరీరానికి విటమిన్ B1 అందాలంటే బఠానీ, హోల్ వీట్ బ్రెడ్, నట్స్ వంటివి ఆహారంగా తీసుకోవాలి. అలాగే విటమిన్ B కోసం పాలు, గుడ్లు, పెరుగు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే లివర్, మష్రూమ్స్, మాంసం, చేపలు, తాజా అరటి పండ్లు, కమలా పండ్లలో థయామిన్ లో ఎక్కువగా లభిస్తుంది.. ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి..