వర్షాలు వచ్చాయంటే చాలు బురద, కలుషితమైన నీరు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది..వానల వల్ల నీటిలో తడవడం, తడి షూస్, సాక్సులు ధరించడం వంటి వాటివల్ల పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్లు ఎక్కువసేపు ఉండటం వల్ల.. పాదాల ఒరుపులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… పాదాలను కాపాడుకోవచ్చు ఆ టిప్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం..
బేకింగ్ సోడాలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. బకెట్లో గోరువెచ్చని నీళ్లు పోసి ఒక స్పూను వంట సోడా, అదే పరిమాణంలో నిమ్మరసం వేసి కలిపి.. పాదాలను ఆ నీటిలో పెట్టాలి. కాసేపటి తర్వాత బయటికి తీసి కాటన్ వస్త్రంతో పాదాలు, వేళ్ల సందులను తడి లేకుండా తుడవాలి. అప్పుడే ఎటువంటి ఇన్ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి…
మీ పాదాలను ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడానికి రాత్రి పూట నిద్రపోయే ముందు.. పావు కప్పుకొబ్బరి నూనెలో రెండు చుక్కల లవంగ నూనె వేసి పాదాలకు మసాజ్ చేయండి. ఇలా రోజూ చేస్తుంటే రక్తప్రసరణ సక్రమంగా జరిగి పాదాలు ఆరోగ్యంగా, మృదువుగా ఉంటాయి..
వెనిగర్ మీ పాదాలను క్లీన్ చేయడానికి ఎఫెక్టివ్గా పని చేస్తుంది. అరబకెట్ గోరువెచ్చని నీటిలో అర మూత వెనిగర్ వేయాలి. ఆ నీటిలో పాదాలను కాసేపు ఉంచాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పాదాలపై మురికి, బ్యాక్టీరియా తొలగుతుంది..
కాళ్ల పగుళ్ల నుంచి ఉపశమనం పొందాలంటే తేనెను వాడాలని నిపుణులు చెబుతున్నారు.. యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న తేనెను రాత్రి పూట రాసి, కొద్దిసేపయ్యాక కడగాలి. ఇది మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది..
ఇక చివరగా గుప్పెడు గులాబీ రేకులను తీసుకోని రెండు తులసి రెమ్మలు, చెంచా ఆలివ్ నూనె నీళ్లల్లో వేసి మరగ బెట్టాలి. గోరువెచ్చగా అయ్యాక కాసేపు అందులో పాదాలను నాననివ్వండి. ఆపై ప్యూమిక్ స్టోన్తో రుద్దితే మృతచర్మం తొలగి కోమలంగా మారతాయి… ఇక వర్షంలో తడిచిన ప్రతి సారి గోరు వెచ్చని నీటితో పాదాలను కడుక్కోవాలి.. ఇలా చెయ్యడం వల్ల పాదాలు బాగుంటాయి..