Leading News Portal in Telugu

Health Tips: ఉదయం లేవగానే నీళ్లు తాగుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?


Health Tips: ఉదయం లేవగానే నీళ్లు తాగుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

చాలా మందికి ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు.. కొందరు మామూలు నీళ్లు తాగితే, మరికొంతమంది మాత్రమే వేడి నీళ్లను తాగుతారు..ఇలా ఉదయాన్నే లేచి నీరు తాగడం అన్నది చాలా మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఉదయం లేవగానే నీటిని తాగడం వల్ల అధిక బరువును తగ్గవచ్చు.. జీర్ణ క్రియ బాగుంటుంది.. అలాగే ఉదయం కనీసం రెండు గ్లాసులు నీటిని తీసుకోవాలి. అలాగే రాత్రంతా నిద్ర పోవడం వలన చాలా గంటల పాటు నీరు అందకుండా పోతుంది..ఇలా తాగితే శరీరంలో నీటి కొరతను కలిగిస్తుంది. ప్రతి ఒక్కరు ఉదయం నిద్ర లేచిన వెంటనే నీరు తాగడానికి కారణం కూడా ఇదే. అలాగే ఎప్పుడైనా చర్మం డల్ గా మారినట్లు అనిపిస్తే నిద్రలేచిన వెంటనే మీరు తాగాలి. ఇలా నీరు తాగడం వల్ల రక్త ప్రసరణ ప్రోత్సహిస్తుంది. కొత్త కణాలు ఉత్పత్తిని పెంచడం వలన చర్మాన్ని మెరిసేలా చేస్తూ ఉంటుంది. ఉదయం పూట మొదటగా నీళ్లు తాగడం వలన కిడ్నీలోని రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

అలాగే ఉదయాన్నే నీటిని తాగితే శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది.. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది మనిషిని మళ్లీ అనారోగ్యానికి గురి చేసే సమస్య నుంచి రక్షిస్తుంది. ఉదయాన్నే నీరు తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవు. మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారు ఉదయం లేవగానే నీటిని తాగితే ఆ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇంకా బీపి సమస్య ఉన్నవారు కూడా నీటిని తాగితే చాలా మంచిది..