Leading News Portal in Telugu

Virtual Wedding: మారిపోయిన పెళ్లి ట్రెండ్.. పాకిస్థాన్ యువకుడ్ని వర్చువల్‌గా వివాహం చేసుకున్న భారతీయ యువతి.. – Telugu News | Jodhpur man virtually marries Pakistani woman as she fails to get Indian visa


కరాచీకి చెందిన అమీనా అనే అమ్మాయి ఇండియాకు చెందిన అర్బాజ్ ఖాన్‌ అనే అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం అమీనా ఇండియాకు వచ్చి అతడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ అనుకోకుండా ఆ ప్లాన్ కాస్తా రివర్స్ అయిపోయింది. విసా అప్లై చేసుకుంటే అది రిజెక్ట్ అయ్యింది. దీంతో చేసేదేమి లేక ఇలా వర్చువల్‌గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

సాధారణంగా పెళ్లి అనేది కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో చేసుకునే ఓ గొప్ప వేడుక. కొంతమంది ఈ విధానాన్ని పాటిస్తారు.. మరికొందరు అతితక్కువ మంది సమక్షంలో రిజిస్టర్ మ్యారెజ్ చేసుకుంటారు. ఇంకొందరైతే ఎవరికి తెలియకుండా పారిపోయి గుళ్లో కూడా చేసుకుంటారు. అయితే ఇప్పుడు మరో ట్రెండ్ వచ్చేసింది. ఇప్పుడు ఏకంగా వర్చువల్‌గానే పెళ్లిల్లు చేసుకుంటున్నారు. ఎవరి ఇంట్లో వాళ్లు కూర్చొని ఆన్‌లైన్‌లోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఇది భారత్‌లోనే అనుకున్నాం. కానీ ఈ ట్రెండ్ ఇప్పుడు పాకిస్థాన్ వరకు వెళ్లింది. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి భారత్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన వ్యక్తితో వర్చువల్‌గా వివాహం చేసుకుంది. అయితే ఇటీవల పాకిస్థాన్‌ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్ ప్రేమ కథ దేశంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ వర్చువల్ పెళ్లి కథ వైరల్ అవుతోంది.

ఇక వివరాల్లోకి వెళ్తే పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన అమీనా అనే అమ్మాయి ఇండియాకు చెందిన అర్బాజ్ ఖాన్‌ అనే అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం అమీనా ఇండియాకు వచ్చి అతడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ అనుకోకుండా ఆ ప్లాన్ కాస్తా రివర్స్ అయిపోయింది. విసా అప్లై చేసుకుంటే అది రిజెక్ట్ అయ్యింది. దీంతో చేసేదేమి లేక ఇలా వర్చువల్‌గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చివరికి ఇలా ఆన్‌లైన్‌లోనే చేసుకున్నారు. అయితే దీనిపై పెళ్లి కొడుకు అర్బాజ్ ఖాన్ స్పందించాడు. అమినా మరోసారి విజా కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పాడు. ప్రస్తుతం సీఏగా విధులు నిర్వహిస్తున్న అర్బాజ్ ఖాన్.. జోధ్‌పుర్‌లోని ఒస్వాల్ సమాజ్ భవన్ కి తన బంధు మిత్రులతో వచ్చాడు. అక్కడే ఆన్‌లైన్‌లో వీరి పెళ్లి జరిగింది. జోధ్‌పుర్ ఖ్వాజీ సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. పాకిస్థాన్‌లో ఉన్న కుటుంబ సభ్యులే ఈ వివాహం ఫిక్స్ చేశారని అర్బాజ్ ఖాన్ చెప్పాడు. త్వరలోనే ఆమెకు వీసా వస్తుందని ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా ఇటీవల మరో ప్రేమ కథ సంచలనం రేపింది. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన పాకిస్థాన్ స్నేహితుడు నస్రుల్లా కోసం భారత్‌కు చెందిన అంజు అనే మహిళ అక్కడికి వెళ్లిన సంగతి ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమె అతడితో కలిసి అక్కడ పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తోంది. డిర్ ఎగువ జిల్లా, చిత్రాల్ జిల్లాలను కలిపై లావారి అనే సొరంగం వద్దకు కూడా వారు వెళ్లారు. అంజు, నస్రుల్లా ఓ పచ్చని తోటలో కూర్చొని చేతులు పట్టుకుని కనిపించారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సందడి చేశారు. ఆ తర్వాత పాకిస్థాన్ లో తాను భద్రంగానే ఉన్నానని అంజూ సోషల్ మీడియా ద్వారా ఓ చిన్న విడియో కూడా పెట్టింది. పాకిస్థాన్‌కు తాను హఠాత్తుగా రాలేదని చట్టప్రకారమే ప్రణాళికతో వచ్చానని చెప్పింది. అలాగే తాము పెళ్లి చేసుకోలేదని కూడా స్పష్టం చేసింది. అంజు ఇస్లాం మతంలోకి మారిపోయి ఫాతిమాగా మార్చుకున్న వార్తలు రాగా.. వీటిని ఆమె కొట్టిపారేసింది.

ఇవి కూడా చదవండి