Manipur Violence: ఇంకా కొలిక్కిరాని మణిపుర్ అంశం.. రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు – Telugu News | Supreme Court constitutes committee of 3 former women judges to oversee humanitarian measures
మణిపుర్ లో చెలరేగిన అల్లర్లు ఇంకా కొలిక్కి రావడం లేదు. అక్కడి పరిస్థితులను చూస్తే ఇప్పటికీ కూడా నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ముడు నెలలుగా మణిపుర్ రాష్ట్రం మండిపోతునే ఉంది. మెయిటీ, కుకీల సామాజిక వర్గాల మధ్య మొదలైన ఈ వైరం రోజురోజుకు తీవ్ర రూపాన్ని దాలుస్తూనే ఉంది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఈ అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
మణిపుర్ లో చెలరేగిన అల్లర్లు ఇంకా కొలిక్కి రావడం లేదు. అక్కడి పరిస్థితులను చూస్తే ఇప్పటికీ కూడా నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ముడు నెలలుగా మణిపుర్ రాష్ట్రం మండిపోతునే ఉంది. మెయిటీ, కుకీల సామాజిక వర్గాల మధ్య మొదలైన ఈ వైరం రోజురోజుకు తీవ్ర రూపాన్ని దాలుస్తూనే ఉంది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఈ అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో రాష్ట్రంలోని అధికార ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై స్పందించింది. కావాలంటే మమ్మల్ని చర్యలు తీసుకోవాలంటూ అంటూ హెచ్చరించింది. మణిపుర్ అంశాన్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి సమయం ఇచ్చింది. అయితే ఇప్పటికే మణిపుర్ అంశం సుప్రీంకోర్టులో పలు దాఖలయ్యాయి. ఇందుకు సంబంధించిన పిటీషన్లపై తాజాగా సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించింది.
మణిపుర్ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై సోమవారం వాడివేడిగా వాదనాలు జరిగాయి. పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లలో అన్ని కూడా తప్పుల తడకగా ఉన్నాయని పేర్కొంది. ఎందుకు ఇలా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా మణిపుర్ డీజీపైనా మండిపడింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అలాగే ఎఫ్ఐఆర్ల నమోదులో ఎన్ని లోపాలు ఉన్నాయని.. ఇందుకు సంబంధించి మొత్తం మణిపుర్ డీజీపీ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే సంఘటనలు జరిగిన తేదీలు, జీరో ఎఫ్ఐఆర్స సాధారణ ఎఫ్ఐఆర్ అలాగే సాక్షి వాంగ్మూలాల వంటివి సంబంధం లేకుండా ఉన్నాయని చెప్పింది. అలాగే సెక్షన్ 164 ప్రకారం సీఆర్పీసీ కింద స్టేట్మెంట్ రికార్డు చేసిన తేదీలన్ని పొంతన లేకుండా ఉన్నాయని పేర్కొంది.
ఈ అల్లర్లపై విచారణ జరిపించేందుకు సుప్రీంకోర్టు ముగ్గరు మాజీ జడ్జిలతో కూడిన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మణిపుర్ హింసాత్మక ఘటనలపై కూడా సమగ్రంగా విచారణ జరిపించడం.. ఈ ఘటనల్లో నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించడం, దాడులను నివారించేలా చర్యలు తీసుకోవడం, పునరావాసం ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ఈ కమిటీ దృష్టి సారిస్తుంది. అలాగే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని కూడా నియమిస్తామని సుప్రీకోర్టు పేర్కొంది. ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనను కూడా ఇప్పటికే సీబీఐకీ బదిలీ చేశామని చెప్పింది. అలాగే సీబీఐకీ బదిలీ చేయనటువంటి కేసులను 42 ప్రత్యేక దర్యాప్తు కమిటీలు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాయని పేర్కొంది. అయితే ఈ మణిపుర్ సమస్య ఇంకా పరిష్కారమవుతుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది