Leading News Portal in Telugu

Vajpayee Death Anniversary: ఘనంగా మాజీ ప్రధాని వాజ్‌పేయి వర్ధంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని


Vajpayee Death Anniversary: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. 5వ వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలు సదైవ్‌ అటల్‌ స్మారకం వద్ద వాజ్‌పేయికి నివాళులర్పించారు. వారితోపాటు కేంద్రమంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు, బీజేపీ నేతలు నివాళులర్పించారు. వాజ్‌పేయి నాయ‌క‌త్వం నుంచి దేశం చాలా ల‌బ్ధి పొందిందని ప్రధాని మోడీ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌ ట్విట్టర్‌లో తెలిపారు. దేశ ప్రగ‌తిలో ఆయ‌న క్రియాశీల పాత్ర పోషించార‌ని.. అనేక రంగాల‌ను 21వ శ‌తాబ్ధం వైపు తీసుకువెళ్లారని పేర్కొన్నారు.

Read also: New Housing Scheme: స్వాతంత్ర్య దినోత్సవంగా సందర్భంగా ప్రధాని కానుక.. కొత్త గృహనిర్మాణ పథకం ప్రారంభం

‘‘అటల్ జీ పుణ్య తిథి నాడు ఆయనకు నివాళులు అర్పించడంలో 140 కోట్ల మంది భారత ప్రజలతో నేను చేరుతున్నాను’’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఆయన నాయకత్వం నుంచి భారతదేశం చాలా లాభపడిందని అన్నారు. మన దేశ ప్రగతిని పెంచడంలో, విస్తృత శ్రేణి రంగాలలో 21వ శతాబ్దానికి తీసుకువెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. బీజేపీ మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన వాజ్‌పేయి.. పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. విశేష ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు వాజ్‌పేయి.. ఆరేళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించి ఘనత సాధించారని తెలిపారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో సంస్కరణలు తీసుకురావడంతోపాటు.. మౌలిక సదుపాయాలను పెంచడానికి కృషి చేశారన్నారు. వాజ్‌పేయి తన 93 సంవత్సరాల వయస్సులో 2018లో మరణించారని గుర్తు చేసుకుని నివాళులర్పించారు.