ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నా.. ఓ జవాన్.. ఆయన భార్య కూడా ప్రభ్వుత్వ ఉద్యోగిణి.. కానీ ఆమె ఉద్యోగం చేయడం అతడికి ఇష్టం లేదు.. అయినా ఆమె రోజూ డ్యూటీకి వెళ్తుంది. ప్రమోషన్ కోసం పరీక్ష రాసేందుకు కూడా రెడీ అయింది. పరీక్ష రాసేందుకు వేరే ప్రాంతానికి వెళ్లి హోటల్ రూమ్ లో ఉండగా.. ఆ టైంలో అక్కడికి వచ్చిన భర్త ఆమె అర చేయి నరికేసి వెళ్లిపోయాడు.
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్ కు చెందిన సతీష్ కుమార్ కుష్వాహా సీఆర్పీపీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్నాడు. అతడి భార్య ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నారు. తన భార్య ఉద్యోగం చేయడం సతీష్ కుమార్ కు ఇష్టం లేదు.. అయినా ఆమె ప్రతీ రోజు డ్యూటీకి వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె ప్రమోషన్ కు అర్హత పొందేందుకు పరీక్ష రాయాలని ఢిల్లీకి శుక్రవారం మధ్యాహ్నం భర్తతో కలిసి వెళ్లింది.
అయితే, ఆదర్శ్ నగర్ లోని ఓ చిన్న హోటల్ లో వీరిద్దరు ఓ అద్దె గదిని తీసుకున్నారు. ఇక, వారి మధ్య ఉద్యోగం విషయంలో గొడవ స్టార్ట్ అయింది. కొంత సమయం తరువాత ఆ గొడవ సద్దుమణిగింది.. దీంతో హోటల్ సిబ్బంది ద్వారా ఈ జంట భోజనం తెప్పించుకున్నారు.. అయితే, సతీష్ కుమార్.. భార్యకు తెలియకుండా అందులో మత్తు మందు కలిపాడు. అది తిన్న తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను మంచానికి కట్టేసి అరచేయి నరికాడు.
అనంతరం అక్కడి నుంచి సతీష్ కుమార్ పారిపోయాడు. ఈ నొప్పితో ఆమె స్పృహలోకి వచ్చింది.. లేచి చూసి తన పరిస్థితి అర్థం చేసుకుని.. గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. బాధితురాలిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అక్కడి డాక్టర్లు గంటల తరబడి ఆపరేషన్ చేసి, ఆమె చేతిని తిరిగి అతికించారు.
ఈ ఘటపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశామని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని డీప్యూటీ పోలీస్ కమిషనర్ జితేంద్ర కుమార్ మీనా పేర్కొన్నారు. కాగా.. నిందితుడు గతంలో కూడా ఉత్తరప్రదేశ్ లోని ఓ మహిళపై దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ దాడి విషయంలో అతడితో పాటు సోదరుడిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైందని యూపీ పోలీసులు చెప్పారు.