Leading News Portal in Telugu

Vande Bharat Express: ‘వందేభారత్‌’లో ప్రయాణం మరింత సౌకర్యవంతం.. మార్పులు చేయనున్న రైల్వేశాఖ


Changes in Vande Bharat Express: దూర ప్రాంతాలకు చేరేందుకు నేటికి చాలా మంది సామాన్యుల ప్రయాణ సాధనం రైళ్లు. అయితే గతంతో పోలిస్తే భారత రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు సంతరించుకున్నారు. ప్రయాణీకులు సౌకర్యార్థం అనేక మార్పులు చేశారు. ప్రస్తుతానికి వేగవంతంగా, సురక్షితంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిపోతుంది. అది వరకు పట్టే సమయంలో సగం మాత్రమే పడుతుంది. అయితే ఈ రైళ్లలో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయడానికి రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న వాటిలో 25 మార్పులు వరకు చేసింది.