Gujarat High Court: ఓ వ్యక్తి బెయిల్ ఆర్డర్కు సంబంధించిన మెయిల్ను జైలు అధికారి తెరవనందున 3 సంవత్సరాలు జైలులో గడిపిన వ్యక్తికి గుజరాత్ హైకోర్టు రూ. 1 లక్ష పరిహారం వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. నిందితుడికి 2020లో బెయిల్ వచ్చింది. అయినా మూడేళ్లపాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈమెయిల్కు జోడించిన హైకోర్టు రిజిస్ట్రీ తమకు పంపిన బెయిల్ ఆర్డర్ను తెరవలేదని జైలు అధికారులు పేర్కొన్నారు. అందుకే అతను మూడేళ్లపాటు జైలులో గడపాల్సి వచ్చిందన్నారు. జైలు అథారిటీ ఈమెయిల్కు జోడించిన బెయిల్ను తెరవలేకపోయినందున 3 సంవత్సరాలు జైలులో గడిపిన వ్యక్తికి గుజరాత్ హైకోర్టు రూ.లక్ష నష్టపరిహారం మంజూరు చేసింది. బెయిల్ లభించినా దాదాపు మూడేళ్లపాటు జైలు జీవితం గడిపిన ఖైదీ దీనస్థితిని దృష్టిలో ఉంచుకుని.. పరిహారం పొందేందుకు అర్హులని కోర్టు పేర్కొంది.
27 ఏళ్ల దోషి చందంజీ ఠాకూర్కు రూ.లక్ష పరిహారం చెల్లించాలని న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ సుపెహియా, జస్టిస్ ఎంఆర్ మెంగ్డేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. ఈ కేసులో నిందితుల రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టు రిజిస్ట్రీ బెయిల్ ఆర్డర్ను జైలు అధికారులకు మెయిల్ చేసింది. కొవిడ్-19 మహమ్మారి దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకోలేదని జైలు అధికారులు చెబుతున్నప్పటికీ, వారికి ఈ-మెయిల్ వచ్చినప్పటికీ వారు మెయిల్లో జోడించిన బెయిల్ ఆర్డర్ను కూడా తెరవలేదు. ఈమెయిల్ను జిల్లా సెషన్స్ కోర్టుకు కూడా పంపినప్పటికీ, దోషిని బెయిల్పై విడుదల చేసిన ఉత్తర్వు సరిగ్గా అమలు చేయబడిందో లేదో చూసేందుకు కోర్టు ఎటువంటి ప్రయత్నం చేయలేదని కోర్టు పేర్కొంది. బెయిల్ లభించినా దాదాపు ఆ వ్యక్తి మూడేళ్లపాటు జైలు జీవితం గడిపాడు. అతని దీనస్థితిని దృష్టిలో ఉంచుకుని పరిహారం పొందేందుకు అతడు అర్హుడని కోర్టు పేర్కొంది.
అసలు విషయం ఏమిటి?
ఓ హత్య కేసులో దోషి జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. అతని శిక్ష సెప్టెంబర్ 29, 2020న నిలిపివేయబడింది. జైలు అధికారులకు హైకోర్టు రిజిస్ట్రీ ఇ-మెయిల్ ద్వారా సమాచారం అందించింది, అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ఇ-మెయిల్ను జైలు అధికారులు పట్టించుకోలేదు. కోర్టు జారీ చేసిన ఉత్తర్వు అమలు కాలేదు. శిక్షా సస్పెన్షన్ ఆర్డర్ గురించి జైలు అధికారులకు తెలియజేయడంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ విఫలమైందని కోర్టు పేర్కొంది. అందువల్ల, దరఖాస్తుదారుకు బెయిల్ లభించినప్పటికీ, జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అతను జైలులోనే ఉన్నాడు.
కోర్టు జైలు అధికారులను బాధ్యులను చేసింది. తీవ్రమైన లోపానికి 14 రోజుల్లోగా రూ. 1 లక్ష పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విషయం తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, బెయిల్ మంజూరు చేయబడిన, ఇంకా విడుదల చేయని ఖైదీలందరి డేటాను సేకరించాలని అన్ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలను ఆదేశించింది.