Leading News Portal in Telugu

Kerala Bomb Blast: టిఫిన్ బాక్సుల్లో ఐఈడీ పెట్టి పేల్చేశారు.. దర్యాప్తు ముమ్మరం..


Kerala Bomb Blast: టిఫిన్ బాక్సుల్లో ఐఈడీ పెట్టి పేల్చేశారు.. దర్యాప్తు ముమ్మరం..

Kerala Bomb Blast: దేశంలో దాదాపుగా 10 ఏళ్ల కాలంగా ఎక్కడా కూడా బాంబు పేలుళ్లు చోటు చేసుకోలేదు. తాజాగా ఈ రోజు జరిగిన కేరళ వరస బాంబు పేలుళ్లతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. కేరళలో ఆదివారం ఉదయం జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో ఒకరు మరణించగా.. 36 మంది గాయపడ్డారు. కొచ్చిలో కన్వెన్షన్ సెంటర్ లో యోహోవా విట్‌నెస్ ప్రార్థనా సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటికే వరసగా మూడు పేలుళ్లు జరిగాయి.

పేలుళ్ల సమయంలో ప్రార్థనల్లో 2000 మంది ఉన్నారు. మొదటి పేలుడు 9.47 గంటలకు చోటు చేసుకుంది. అయితే ఈ దాడిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ని ఉపయోగించారని, కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని కేరళ పోలీసులు తెలిపారు.పేలుడు పదార్థాలను టిఫిన్ బాక్స్‌లో ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఇప్పటికే ఈ కేసును విచారించేందుకు కేరళకు చేరింది. ఈ పేలుడు దురదృష్టకరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. పేలుళ్ల తర్వాత విధులకు హాజరు కావాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రభుత్వ ఆరోగ్య నిపుణులను కోరారు.పేలుళ్లపై హోంమంత్రి అమిత్ షా కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడారు.