Leading News Portal in Telugu

Encounter: యూపీలో ఎన్కౌంటర్.. క్రిమినల్ రషీద్ కాలియా హతం



Encounter

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో క్రిమినల్ రషీద్ కాలియాను హతమార్చారు. ఓ కాంట్రాక్టర్ ను చంపేందుకు వచ్చిన సమయంలో యూపీ ఎస్టీఎఫ్ బలగాలు దాడి చేశారు. ఘటనా స్థలంలో అతని వద్ద నుంచి రెండు పిస్టల్స్‌, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రగాయాలైన రషీద్ కాలియాను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఎన్ కౌంటర్ ఘటనలో డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్ కు బుల్లెట్‌లు తగిలాయి. వారు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ల కారణంగా ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు.

Read Also: Commando Suicide: పిస్టల్‌తో కాల్చుకుని గరుడ్ కమాండో ఆత్మహత్య

రషీద్ కలియా 40 హత్యలు చేశాడని.. అతనిపై రూ. 1.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. క్రిమినల్ రికార్డుల ప్రకారం.. కాలియా అనేక హై ప్రొఫైల్ కేసులలో ప్రమేయం ఉంది. 2020లో గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు పింటు సెంగార్ హత్యలో ఇతను ఉన్నాడు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి చంద్రుడిపై భూమి ఇచ్చిన వ్యక్తి పింటూ సెంగార్.

Read Also: Dog Meat: శతాబ్ధాల సంప్రదాయం.. కుక్క మాంసం వినియోగానికి స్వస్తి చెప్పనున్న ఆ దేశం..

ఇదిలా ఉంటే.. కాలియాపై కాన్పూర్, ఝాన్సీలలో దోపిడీ, హత్య, హత్యాయత్నం సహా 13 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కాన్పూర్ జోన్) అతడిపై లక్ష రూపాయల రివార్డును ప్రకటించారు. మరోవైపు కాలియా.. 45 చట్టాన్ని అమలు చేయకుండా ఉండటానికి తక్కువ ప్రొఫైల్‌ను నిర్వహించడంలో ప్రసిద్ది చెందాడు.