Leading News Portal in Telugu

Kota Coaching : ఏడేళ్లలో 121 ఆత్మహత్యలు… కోటా ఎందుకు విద్యార్థులకు ‘మృత్యు జంక్షన్’గా మారుతోంది?


Kota Coaching : ఏడేళ్లలో 121 ఆత్మహత్యలు… కోటా ఎందుకు విద్యార్థులకు ‘మృత్యు జంక్షన్’గా మారుతోంది?

Kota Coaching : రాజస్థాన్‌లోని కోటాలో చిన్నారుల ఆత్మహత్యల వ్యవహారం ఆగేలా కనిపించడం లేదు. మూడు రోజుల క్రితమే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ 20 ఏళ్ల విద్యార్థి నీట్‌కు సిద్ధమవుతున్నాడు. గతేడాదే కోటాకు వచ్చాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు కోటాలో 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గణాంకాలను పరిశీలిస్తే గత ఏడేళ్లలో 121 మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ డేటా 2015 నుండి 2023 వరకు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోటా విద్యార్థులకు ‘మృత్యు జంక్షన్‌’గా ఎందుకు మారుతోంది అనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది.

డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకునే పిల్లలు ఎన్నో ఆశలతో కోటకు వస్తారు. అయితే హఠాత్తుగా వారి ఆత్మహత్య వార్త చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. గత ఏడేళ్లలో 121 మంది పిల్లలు బలన్మరణాలకు పాల్పడ్డారు. దేశంలోనే అతిపెద్ద కోటింగ్ హబ్‌గా భావించే కోటాలో ఇలా ఎందుకు జరుగుతోందన్నదే అతిపెద్ద ప్రశ్న. పిల్లలు ఈ చర్యలు ఎందుకు పూనుకుంటున్నారు ? 2020, 2021ని మినహాయిస్తే 2015 నుంచి 2023 వరకు 121 మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గణాంకాలను పరిశీలించండి…

2015-18
2016-17
2017-7
2018-20
2019-18
2022- 15
2023- 26*

పిల్లలు ఆత్మహత్యల వంటి చర్యలు ఎందుకు తీసుకుంటారు?
కోటాలో దాదాపు ప్రతినెలా విద్యార్థుల ఆత్మహత్యల కేసులు వెలుగులోకి వస్తాయి. విజయం కోసం కలలు కనే ఈ విద్యార్థులు ఒత్తిడి భారంతో నలిగిపోతున్నారు. ఇటు చదువులు, అటు తల్లిదండ్రులు ఏదో ఒకటి సాధించాలనే ఒత్తిడి, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ఒత్తిడి… వైఫల్యాల ఒత్తిడి చాలా సందర్భాలలో వారిని తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. కోటాలో పిల్లలు విజయం సాధించలేదని కాదు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా విజయం సాధించలేమోననే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లలు కలలు కనే కోటా నేడు వారి ‘ఆత్మహత్య’లతో అపఖ్యాతి పాలైంది. కోటా నేడు విద్యార్థులకు ‘మృత్యు జంక్షన్’గా మారడం ఆందోళన కలిగిస్తోంది.