
Delhi : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఓ ఈవెంట్లో గేట్ నంబర్ టూ వద్ద పెద్ద పాండల్ కూలిపోయింది. పాండల్ కూలిపోవడంతో గందరగోళం నెలకొంది. ఘటన జరిగిన వెంటనే అనేక అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణనష్టం గురించి ఇంకా సమాచారం లేదు.
Read Also:Minister Kakani Govardhan Reddy: ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఎన్నికల్లో చూసుకుందాం..!
జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో పాండల్ కూలిన సంఘటనలో గాయపడిన వారిని సమీపంలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి.. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ట్రామా సెంటర్లో చేర్చారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది.
Read Also:Drugs Case: గోవా జైల్ నుంచి డ్రగ్స్ దందా.. రూ.8 కోట్ల మత్తుపదార్థాల కేసులో మరో ఇద్దరు అరెస్ట్..