
New Delhi : ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) బుధవారం (ఫిబ్రవరి 28) ఖజూరి ఖాస్ ప్రాంతంలో ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ను ప్రారంభించి అనేక ఇళ్లను కూల్చివేసింది. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన కూల్చివేతల కారణంగా నిరాశ్రయులైన వారిలో వకీల్ హసన్ కూడా ఉన్నారు. అతని బృందంతో పాటు ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించినందుకు గత ఏడాది నవంబర్లో అతనికి అవార్డు లభించింది. వకీల్ హసన్ వృత్తి రీత్యా ‘ర్యాట్ హోల్ మైనర్’.
Read Also:Daggubati Purandeswari: రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై బీజేపీ మాత్రమే పోరాటం చేస్తుంది: పురందేశ్వరి
తన ఇల్లు కూల్చివేసిన తర్వాత వకీల్ హసన్ మాట్లాడుతూ.. ‘ఇక మాకు చనిపోవడమే ఆప్షన్. మేము సిల్క్యారా టన్నెల్లో 41 మందిని రక్షించాము. అందుకు మాకు ప్రతిఫలంగా ఇది లభించిందని ఆవేదన చెందారు. నేను చాలా బాధగా పడుతున్నాను. ఏమి చెప్పలేను, నాకు ఏమి జరిగిందో మొత్తం సమాజం అర్థం చేసుకోగలదు. దేశం కోసం ఇంత మంచి పని చేశాను. నన్ను నేను పొగుడుకోదలుచుకోలేదు. ఈ పనికి నాకు లభించిన ఫలితం ఏమిటంటే నా ఇంటిని కోల్పవడం. నా పిల్లలు రోడ్డు మీద కూర్చున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? నేడు డబ్బు సంపాదించడం కష్టంగా మారుతోంది. ఇల్లు ఎక్కడ కొనుక్కోగలను ? చనిపోవడమే ఏకైక మార్గం. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఎందుకు పగలగొడుతున్నారని అడిగితే కారణాలు వాళ్లు చూపించలేదు. అందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. 8 గంటల దాకా ఉన్నారు. తన కుమార్తెను, భార్యను కూడా అక్కడే ఉంచాడు. నా కొడుకును కొట్టారు. ప్రపంచం మనల్ని కొనియాడుతోంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాకు రూ.50,000 ఇచ్చింది. కానీ దానితో ఏమి జరుగుతుంది?’ వాపోయారు. అభివృద్ధి పనుల్లో ఆక్రమణ నిరోధక డ్రైవ్ నిర్వహించినట్లు డీడీఏ తెలిపింది. ఈ ఆపరేషన్లో అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలను కూల్చివేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also:Bill Gates : ఛాయ్ వాలాతో బిల్ గేట్స్ జుగల్బందీ.. వైరల్ అవుతున్న వీడియో
#WATCH | Delhi: House of one of the rat miners, who were part of Uttarkashi tunnel rescue operation, razed during an anti-encroachment drive by DDA (28/02) pic.twitter.com/3069wrOAi9
— ANI (@ANI) February 29, 2024