
దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. సీటెట్ పరీక్షను 2024 జులై 7న నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ పేర్కొంది.
దేశ వ్యాప్తంగా 136 నగరాల్లో 20 భాషల్లో నిర్వహించే ఈ పరీక్షకు మార్చి 7 నుంచి ఏప్రిల్ 2 రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఈ సీటెట్ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తారు. ఈ సీటెట్లో సాధించిన స్కోర్కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుంటూరు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్ వరంగల్లో సెంటర్లు ఉన్నాయి.