Leading News Portal in Telugu

Raadhika Sarathkumar: విరుదునగర్‌ స్థానం నుంచి సినీనటి రాధికా శరత్‌కుమార్‌ పోటీ?



Raadhika Sarathkumar

Actress Raadhika Likely to Contest from Virudhunagar: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పొత్తులతో ముందుకు దూసుకెళుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో బీజీపీ కూటమిలో ఇండియా జననాయగ, పుదియ నీది, టీఎంసీ, జాన్‌పాండియన్‌ తదితర పార్టీలు చేరాయి. సినీ నటుడు శరత్‌కుమార్‌ నేతృత్వంలోని సమత్తువ మక్కల్‌ కట్చి కూడా చేరింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.

Also Read: Ashwin-Kuldeep: నువ్వు, నేను అంటూ.. అశ్విన్‌, కుల్దీప్‌ మధ్య చర్చ! వీడియో వైరల్

తమకు విరుదునగర్‌ నియోజకవర్గం కావాలని సమత్తువ మక్కల్‌ కట్చి కోరిందట. అందుకు బీజీపీ కూటమి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. విరుదునగర్‌లో సినీనటి రాధికను కమలం గుర్తుపై బరిలోకి దింపేందుకు ఆమె భర్త శరత్‌కుమార్‌ నిర్ణయించారట. మరోవైపు డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌, ఎండీఎంకే పార్టీలు విరుదునగర్‌ స్థానాన్ని కోరుతున్నాయని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌కు విరుదునగర్ నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరపున ఎంపీ మాణికం ఠాగూర్ పోటీ చేస్తారని సమాచారం. విరుదునగర్‌లో ఎవరు పోటీ చేయనున్నారో కొన్ని రోజుల్లో తెలియనుంది.