Leading News Portal in Telugu

UK Inflation: యూకేలో ఆర్థిక మాంద్యం.. ఇబ్బంది పడుతున్న భారత విద్యార్థులు



Uk

బ్రిటన్ దేశాన్ని ఆర్థిక మాంద్యం చుట్టు ముట్టింది. 2023 నాలుగో త్రైమాసికంలో జీడీపీ 0.3 శాతం క్షీణించడంతో దేశం మాంద్యంలోకి మెల్లగా జారుకుంది. ఇది భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో యూకేలోని భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రధానంగా ఉద్యోగాలపై పడుతుందన్నారు. ఉద్యోగం రాకుండానే పోస్టు స్టడీ వర్క్‌ వీసా అయిపోతుందని పలువురు స్టూడెంట్స్ భయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలించిన తర్వాత జీవన వ్యయం పెరిగిపోతుండటంతో యూకేలో ఉద్యోగం చేయాలనే ప్రణాళికను విరమించుకొని భారత్ కు తిరిగి వచ్చేందుకు కొందరు విద్యార్థులు యోచిస్తున్నారు.

Read Also: Sreeleela : అదిరిపోయే లుక్ లో శ్రీలీలా కిర్రాక్ పోజులు..

ఇక, ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న జాబ్‌ మార్కెట్‌ పరిస్థితి ఆర్థిక మాంద్యంతో మరింత దిగజారిపోయింది. అలాగే, పెరుగుతున్న జీవన వ్యయంతో పాటు పని ఒత్తిడి కారణంగా ఉద్యోగం పొందిన కొంత మంది విద్యార్థులు కూడా స్పాన్సర్‌షిప్‌ ద్వారా వీసా పొడిగించేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బ్రిటన్ లో మాంద్యం పరిస్థితులతో విద్యార్థుల్లో ఉద్యోగ అభద్రతాభావం నెలకొంది. ప్రపంచస్థాయి విద్య, ఉద్యోగం పొందడంలో సాయం చేస్తామంటూ విద్యార్థులను ఆకర్షించిన యూకే ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో మాట తప్పయాని విమర్శలు వస్తున్నాయి.