Leading News Portal in Telugu

Badlapur: బాలికలపై అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ స్వీపర్..పెద్దఎత్తున నిరసనలు..రైలు రోకో


  • దేశ వ్యాప్తంగా దుమారం రేపిన కోల్ కతా ఘటన
  • తాజాగా మహారాష్ట్రలో మరో ఘటన
  • నర్సరీ చదువుతున్న ఇద్దరు బాలికలపై స్వీపర్ అఘాయిత్యం
  • పెద్ద ఎత్తున నిరసనలు
  • రైల్వే ట్రాక్ దిగ్భందం
Badlapur: బాలికలపై అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ స్వీపర్..పెద్దఎత్తున నిరసనలు..రైలు రోకో

కోల్‌కతాలో ఓ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. తాజాగా ముంబైలోని థానేలో ఇద్దరు బాలికలను వేధించడంపై తల్లిదండ్రుల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. కోల్‌కతాలాగే ఇప్పుడు ముంబైలోనూ ప్రజల ఆగ్రహం కనిపిస్తోంది. ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లాలోని బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఇద్దరు బాలికలపై ఓ స్వీపర్ ఈనెల 14న అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై పెను దుమారం చెలరేగుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. నిరసన కారులు పాఠశాలను ధ్వంసం చేసి రైల్వే ట్రాక్‌ను దిగ్బంధించారు. ఆ తర్వాత పోలీసులు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

READ MORE: Guwahati video: సిక్కింలో ప్రమాదం.. పవర్ స్టేషన్‌పై పడ్డ కొండచరియలు

నిరసనల కారుల సంఖ్య పెరిగింది. ఆగ్రహించిన ప్రజల పెద్ద ఎత్తున నగరంలో బ్యానర్లు, పోస్టర్లతో బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం ఎలాంటి స్టాండ్ తీసుకోకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతే కాకుండా ఒక్కసారిగా నిరసన కారులు రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించారు. రైలు ట్రాక్ లను నిర్భంధించారు. ఈ సమయంలో పోలీసులు జనాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో జనం రాళ్లు రువ్వారు. ట్రాక్‌లపై ధర్నాలు చేయడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్‌పై గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది. నిరసన కారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులపైకి ప్రజలు రాళ్లు రువ్వారు. ఈ వేధింపుల సమస్య ఊపందుకోవడం ప్రారంభించింది.

READ MORE:CM Chandrababu: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

దోషులను వదిలిపెట్టం:
బద్లాపూర్ ఘటనపై సీఎం.. ఈ విషయాన్ని తాను సీరియస్‌గా తీసుకున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. దీనిపై విచారణకు సిట్‌ ఏర్పాటు చేసి ఘటన జరిగిన స్కూల్‌పై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసులో దోషులుగా తేలినా ఎవరినీ విడిచిపెట్టబోమన్నారు. ఈ వ్యవహారంలో, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సిట్‌కు ఐజీ ర్యాంక్ సీనియర్ ఐపీఎస్ అధికారిణి ఆర్తీ సింగ్ నేతృత్వం వహించనున్నారు. ఈ బృందం బద్లాపూర్ కేసును విచారించనుంది. దీంతో పాటు ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకెళ్లేందుకు ప్రతిపాదన ఇవ్వాలని థానే పోలీస్ కమిషనర్‌ను కోరారు. తద్వారా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవచ్చు.