- కేరళలో సోమవారం సాయంత్రం పెను ప్రమాదం
- ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్ వాహనాలు ఢీ
- కాన్వాయ్ మధ్య వాహనంలో సీఎం
- నడి రోడ్డుపై స్కూటీ ఆపి కుడివైపునకు తిప్పిన మహిళ

కేరళలో సోమవారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్ వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి. కాన్వాయ్ మధ్య వాహనంలో సీఎం కూడా కూర్చున్నారు. వేగంగా వెళ్తున్న కాన్వాయ్కు ముందు ఓ మహిళ అకస్మాత్తుగా స్కూటర్పై రావడంతో ఈ ఘటన జరిగింది. నడి రోడ్డుపై మహిళ స్కూటర్ ను ఆపి కుడి వైపునకు తిప్పింది. దీంతో కాన్వాయ్లో వెళ్తున్న కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో వెనుక నుంచి వస్తున్న వాహనాలన్నీ ఢీకొట్టాయి. ఈ సమయంలో పలు వాహనాలు గాలిలో నిలిచిపోయాయి.
తిరువనంతపురంలో ఘటన..
తిరువనంతపురంలోని వామనపురం పార్క్ జంక్షన్ వద్ద సోమవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది సీఎం భద్రతలో పెద్ద లోపంగా భావిస్తున్నారు.
సీఎం కాన్వాయ్ ప్రయాణిస్తున్న అదే రోడ్డులో ఓ మహిళ స్కూటీపై వెళ్తోంది. ఆమె నడి రోడ్డుపై మలుపు తీసుకుంటుండగా వెనుకవైపు నుంచి వచ్చిన సీఎం కాన్వాయ్లోని పోలీసు వాహనం ఒక్కసారిగా ఆగింది. ఇక కాన్వాయ్లో వెనుక నుంచి వస్తున్న వాహనాలు కంట్రోల్ అవ్వలేదు. సడెన్ బ్రేక్స్ వేసినా ఫలితం లేకపోయింది. దీంతో వరుసగా ఐదు వాహనాలు ఒక్కదాన్ని మరొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో అంబులెన్స్ కూడా కాస్త డ్యామేజ్ అయ్యింది.
మహిళను కాపాడేందుకే బ్రేక్..
ఈ యాక్సిడెంట్కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ స్కూటర్పై వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. నడి రోడ్డుపై రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసి స్కూటర్ కట్ చేసింది. వెనుక నుంచి కేరళ సీఎం పినరయి విజయన్ కాన్వాయ్ ఎంసీ రోడ్డు గుండా వెళుతోంది. మహిళను కాపాడేందుకు కాన్వాయ్లో వెళ్తున్న వాహనం డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. ట్రాఫిక్ కారణంగా కాన్వాయ్ నెమ్మదిగా వెళ్లింది, లేకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. ప్రాథమిక నివేదికల ప్రకారం, రోడ్డు మధ్యలో నుండి అకస్మాత్తుగా కుడి మలుపు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న స్కూటర్ను నడుపుతున్న మహిళను ఢీకొట్టకుండా ఉండటానికి ఎస్కార్ట్ వాహనం అకస్మాత్తుగా బ్రేకులు వేసింది. దీంతో సీఎం అధికారిక కారును ఎస్కార్ట్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
సీఎం కొట్టాయం నుంచి తిరిగి వస్తున్నారు
ఢీకొనడంతో కాన్వాయ్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది హడావుడిగా వాహనాల నుంచి దిగిపోయారు. ముందుగా అందరూ సీఎం కారు దగ్గరకు వెళ్లి ఆయన భద్రతకు భరోసా ఇస్తున్నారు. ఆ తర్వాత వాహనాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించి కాన్వాయ్ ముందుకు సాగుతుంది. ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొట్టాయం పర్యటన ముగించుకుని కేరళ రాజధానికి విజయన్ తిరిగి వస్తున్నారు.
మహిళ కోసం అన్వేషణ..
మహిళ ఆచూకీ కోసం పోలీసులు విచారణ ప్రారంభించారు. ఢీకొనడం వల్ల సాధ్యమయ్యే ట్రాఫిక్ ఉల్లంఘనలపై దృష్టి సారించే కేసు నమోదు చేయబడింది. 2021లో కన్నూరులో సీఎం కాన్వాయ్తో కూడిన మూడు ఎస్కార్ట్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనను ఈ ఘటన గుర్తు చేస్తుంది.
Who’s fault? Kerala CM @pinarayivijayan convoy gets into multi-car crash to save scooter rider who took sudden turn. #KeralaCM #keralaAccident pic.twitter.com/EQwLZit9Hq
— Manash Pratim Deka (@88manashdeka) October 29, 2024