Leading News Portal in Telugu

india-china disengagement and now exchange sweet on diwali


  • లడఖ్‌లో వెనక్కి తగ్గిన భారత్- చైనా సైన్యాలు
  • సరిహద్దుల్లో సాధారణ పెట్రోలింగ్
  • ఇరు దేశాల మధ్య శాంతి యుగానికి నాందిగా ఈ చర్య
  • దీపావళి సందర్భంగా పరస్పరం స్వీట్లు పంచుకోనున్న సైనిక వర్గాలు
India-China: వెనక్కితగ్గిన చైనా సైన్యం.. దీపావళి స్వీట్లతో నోరు తీపి చేయనున్న ఇండియన్ ఆర్మీ

లడఖ్‌లో భారత్, చైనా సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు ఇరు దేశాల సైన్యాలు 2020లో ఘర్షణకు ముందు ఉన్న వారి సంప్రదాయ పోస్టుల వద్ద మోహరించి ఉంటాయి. ఇప్పుడు సరిహద్దుల్లో సాధారణ పెట్రోలింగ్ మాత్రమే ఉంటుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ చర్య రెండు దేశాల మధ్య శాంతి యుగానికి నాందిగా పరిగణించబడుతుంది. గురువారం దీపావళి సందర్భంగా ఇరు సేనలు పరస్పరం స్వీట్లు పంచుకుంటాయని సైనిక వర్గాలు తెలిపాయి. తూర్పు లడఖ్‌లోని డెప్సాంగ్, డెమ్‌చోక్‌లలో ఇరు దేశాల సైన్యాలు విడిచిపెట్టాయని తెలిపారు.

READ MORE: AP Govt: ఏపీలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

ఇరు సైన్యాల మధ్య కమాండర్ స్థాయి చర్చలు కొనసాగుతాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉద్రిక్తత ముగిసిందని, ఇరు దేశాల పోస్టులు యథాతథంగా సంప్రదాయ స్థానాల్లోనే ఉంటాయన్నారు. సుమారు 4 సంవత్సరాల తరువాత.. చైనా- భారతదేశం మధ్య సరిహద్దులో పరిస్థితి సాధారణమైంది. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత సాధారణం కావచ్చని భావిస్తున్నారు. 2020లో జరిగిన ఘర్షణ తర్వాత, భారత్ కఠినమైన చర్యలు తీసుకుంది. అనేక చైనా కంపెనీలను నిషేధించింది. ఇది కాకుండా.. అనేక రంగాలలో పెట్టుబడులు కూడా నియంత్రించబడ్డాయి.

READ MORE:C Voter Survey Maharashtra: మహారాష్ట్ర ప్రజలు ఎవర్ని సీఎంగా కోరుకుంటున్నారు..?

2020లో అసలు ఏం జరిగింది?
2020 జూన్‌ 15వ తేదీన తూర్పు లఢఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. అటు చైనా సైనికులు కూడా భారీగానే చనిపోగా.. ఆ విషయాన్ని డ్రాగన్ బయటికి రానివ్వలేదు. ఈ ఘర్షణల్లో భారీగా చైనా సైనికులు చనిపోయినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. చాలా రోజుల తర్వాత కేవలం ఐదుగురు సైనికులు మాత్రమే చనిపోయినట్లు డ్రాగన్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘర్షణల కారణంగా ఎల్‌ఏసీ వెంబడి రెండు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు