Leading News Portal in Telugu

The rules for credit card, LPG gas, train tickets to fixed deposit expiry will change from November 1


  • నవంబర్ నెలలో పలు నిబంధనలు మార్పులు.
  • రైలు టిక్కెట్ రిజర్వేషన్ లో మార్పు
  • మనీ ట్రాన్స్‌ఫర్ రూల్స్
  • క్రెడిట్ కార్డ్ నియమాలు..
November 1st Rules Change: నవంబర్ నెలలో మార్పులు కానున్న పలు నిబంధనలు ఇవే

November 1st Rules Change: ప్రతి నెలలాగే వచ్చే నవంబర్ నెలలో కూడా పలు నిబంధనలలో మార్పులు రానున్నాయి. క్రెడిట్ కార్డ్, ఎల్పిజి గ్యాస్, రైలు టిక్కెట్ల నుండి ఫిక్సెడ్ డిపాజిట్ గడువు వరకు నియమాలు నవంబర్ 1 నుండి మారుతాయి. ఇది సామాన్యుల జేబులపై ప్రభావం చూపనుంది. వచ్చే నెల నుండి ఏ నియమాలు మారుతున్నాయో.. అవి మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒకసారి చూద్దాం.

ఎల్పిజి సిలిండర్ ధరలు :

ప్రతి నెల మొదటి తేదీన, పెట్రోలియం కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను మారుస్తాయి. ఇందులో భాగంగా కొత్త రేట్లను విడుదల చేస్తాయి. ఈసారి కూడా దీని ధరలు నవంబర్ 1వ తేదీన మారుతాయి. చాలా కాలంగా నిలకడగా ఉన్న 14 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ ధరలు ఈసారి మరింత తగ్గుముఖం పడతాయని ప్రజలు భావిస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర గురించి చూస్తే.. జూలై నెలలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర తగ్గింది. అయితే, ఆ తర్వాత వరుసగా మూడు నెలలు పెరుగుతూ వచ్చింది.

ATF, CNG – PNG ధరలు:

చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెలా 1వ తేదీన సవరిస్తాయన్న విషయం, తెలిసిందే. దీనితో పాటు CNG-PNG, ఎయిర్ టర్బైన్ ఇంధనం ( ATF) ధరలు కూడా మారుతాయి. గత కొన్ని నెలలుగా వాయు ఇంధనం ధరలో తగ్గుదల ఉంది. ఈసారి కూడా ధరలను తగ్గించి పండుగ కానుకగా భావిస్తున్నారు. ఇది కాకుండా, CNG – PNG ధరలలో కూడా పెద్ద మార్పును చూడవచ్చని అంచనా వేస్తున్నారు.

క్రెడిట్ కార్డ్ నియమాలు:

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 1 నుండి దేశంలో అమల్లోకి రానున్న మార్పు గురించి మాట్లాడుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సంస్థ SBI కార్డ్ తన క్రెడిట్ కార్డ్ ద్వారా యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీలకు సంబంధించిన పెద్ద మార్పులను నవంబర్ 1 నుండి అమలు చేయబోతోంది. నవంబర్ 1 నుండి అసురక్షిత SBI క్రెడిట్ కార్డ్‌లపై ప్రతి నెలా రూ. 3.75 ఫైనాన్స్ ఛార్జీలు చెల్లించాలి. ఇది కాకుండా.. విద్యుత్, నీరు, ఎల్‌పిజి గ్యాస్, ఇతర యుటిలిటీ సేవలకు రూ.50,000 కంటే ఎక్కువ చెల్లింపుపై 1 శాతం అదనపు ఛార్జీ విధించబడుతుంది.

మనీ ట్రాన్స్‌ఫర్ రూల్స్:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ (DMT) కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇది నవంబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఈ నిబంధనల ఉద్దేశ్యం మోసం కోసం బ్యాంకింగ్ ఛానెల్‌లను దుర్వినియోగం చేయకుండా నిరోధించడం.

రైలు టిక్కెట్ రిజర్వేషన్ లో మార్పు:

భారతీయ రైల్వే రైలు టిక్కెట్ ముందస్తు రిజర్వేషన్ వ్యవధి (ARP) ప్రయాణ రోజును నవంబర్ 1, 2024 నుండి 120 రోజుల నుండి 60 రోజులకు తగ్గించబడుతుంది. టికెట్ కొనుగోలు ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా ప్రయాణీకుల సౌకర్యాన్ని కొనసాగించడం ఈ సవరణ ముఖ్య లక్ష్యం.

బ్యాంకు సెలవులు:

పండుగలు, ప్రభుత్వ సెలవులు అలాగే అసెంబ్లీ ఎన్నికల కారణంగా వివిధ రాష్ట్రాలలో వివిధ రోజులను చూస్తే.. మొత్తంగా 13 రోజుల పాటు బ్యాంకుల్లో పని ఉండదు. నవంబర్‌లో మొత్తం 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ బ్యాంక్ సెలవుల సమయంలో, మీరు బ్యాంకుల ఆన్‌లైన్ సేవలను ఉపయోగించి మీ బ్యాంకింగ్ సంబంధిత పని, లావాదేవీలను పూర్తి చేయవచ్చు.