Leading News Portal in Telugu

ఈ బంధం మూన్నాళ్ల ముచ్చటే : బీజేపీ ఎమ్మెల్యే

కర్ణాటక, బళ్లారి: సీఎం కుమారస్వామి రైతుల రుణమాఫీ చేయడం మంచిదే…అయితే అధికారులు, బ్యాంకులతో చర్చిస్తున్నామంటూ మీనమేషాలు లెక్కిస్తుండటం ఎంతవరకు సబబుగా ఉందని ఎమ్మె ల్యే శ్రీరాములు ప్రశ్నించారు. విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎందుకింత తాత్సారం అంటూ ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ చేసే విషయం కేవలం మాటలకే పరిమితం కారాదని, సిద్దరామయ్య పాలనలో రైతుల రుణమాఫీకి 14నిబంధనలుంచి రైతులను ఇబ్బందుల పాలు చేశారన్నారు.

రైతు రుణమాఫీ కుమారస్వామి చేత కాదని, రుణమాఫీ చేయకపోతే తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. మొన్నటి వరకు ప్రజలే హైకమాండ్‌ అని చెప్పిన సీఎం కుమారస్వామి, ఇప్పుడేమో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ బంధంలో చి క్కుకొని మీనమేషాలు లెక్కిస్తూ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని కించపరిచేలా చేస్తున్నారన్నారు. అధికారం కోసం హెచ్‌డీకే రెండు నాలుకల దోరణిని అనుసరిస్తున్నారని, రైతుల రుణమాపీ ఎందుకు ఆలస్యం అవుతున్నదాన్ని ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశా రు. కుమారస్వామి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరన్నారు. సభలో రైతులవిషయంపై గందరగోళంగా ఉంటే, సలహా కోరడానికి రైతుల సభను ఏ ఉద్దేశంతో పిలిచారని ప్రశ్నించారు. రుణమాఫీ జారీకి సభలో, బయట పోరాటాన్ని చేస్తామన్నారు. పది సంవత్సరాల తర్వాత అధికారం దక్కింది, దీన్ని గు ర్తుంచుకొని పాలన జరపాలని, రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దని, కాంగ్రెస్‌ హైకమాండ్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవడం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యేలు మంత్రి స్థానం వద్దని అంటున్నారు… ఈ ప్రభుత్వం మరెంతో కాలం ఉండదన్న భయంతోనే మంత్రి పదవులు వద్దంటున్నట్లు తెలుస్తోందన్నారు. చట్టానికన్న ఎవరూ పెద్ద కారని, రాములే కాని, ఎవరే కాని చట్టం, న్యాయం కన్నా పెద్దవారుకాదని, రాములు ఏ తప్పుచేయలేదు, చేయరన్న నమ్మకం ప్రజలో ఉందని, ఏమైనా అయింది కాని, డీకే శివకుమార్‌ బ్రదర్స్‌ సీబిఐ పై తప్పుగా మాట్లాడటం సరికాదని, గాలి జనార్దన్‌రెడ్డిని సీబిఐ అరెస్టు చేసినపుడు ఏమైందని ప్రశ్నించారు. ఇప్పుడు అరెస్టు, విచారణ ఎ దుర్కొవాలన్న భయంతోనే కేంద్ర ప్రభుత్వాన్ని దూషించడం సరికాదన్నారు. చేతనైతే స్వతంత్రంగా పరి ష్కరించుకోవాలన్నారు.