Coronavirus: ఆంధ్రప్రదేశ్లోని రైల్వే స్టేషన్లలో ఐసోలేషన్ కోచ్లు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి భారతీయ రైల్వే తన వంతు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నాన్ ఏసీ కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తోంది. 5,000 బోగీలను 80,000 ఐసోలేషన్ బెడ్స్గా మార్చే పనిలో ఉంది. అవసరమైతే 20,000 కోచ్లను 3,20,000 ఐసోలేషన్ బెడ్స్గా మారుస్తామంటోంది రైల్వే. తెలంగాణలోని సికింద్రాబాద్ హెడ్క్వార్టర్గా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధికి 486 కోచ్లు అంటే 7,776 ఐసోలేషన్ బెడ్స్ కేటాయిస్తామని ప్రకటించింది రైల్వే. దక్షిణ మధ్య రైల్వే రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించి ఉంది. ఇప్పటికే రైల్వే స్టేషన్లకు ఐసోలేషన్ కోచ్లను తరలిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం, మచిలీపట్నం, కాకినాడ, విజయవాడ స్టేషన్లకు 50 కోచ్లను పంపినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అంటే ఈ 50 కోచ్లల్లో 800 ఐసోలేషన్ బెడ్స్ ఉంటాయి.
ఈ కోచ్లో ఆక్సిజన్తోపాటు వైద్య పరీక్షలకు సంబంధించిన కిట్స్ అందుబాటులో ఉన్నాయి. వైద్య సిబ్బంది కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదై చికిత్సకు సరిపడా గదులు లేనప్పుడు ఈ బోగీలను ఉపయోగించుకోవచ్చని రైల్వే చెబుతోంది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలని రైల్వే సూచిస్తోంది.