Leading News Portal in Telugu

అక్కడ మే 1 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. దేశంలోనే రెండో రాష్ట్రం

లాక్‌డౌన్ పొడిగింపుపై దేశమంతటా చర్చ జరుగుతున్న వేళ పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మే 1 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్/కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పంజాబ్ కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాగా, దేశంలో లాక్‌డౌన్ పొడిగించిన రెండో రాష్ట్రం పంజాబ్ కావడం విశేషం. ఇంతకు ముందు ఒడిశా ప్రభుత్వం కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగించింది.