షాకింగ్…కోలుకున్న వారికి కూడా మరోసారి కరోనా సోకే చాన్స్…
ఓ వైపు ప్రపంచ మంతా కరోనా కాటుకు విలవిలలాడుతుంటే, ఇప్పుడు మరో షాకింగ్ వార్త ప్రపంచాన్ని కలవరపెడుతోంది. అది ఏంటంటే…కోలుకున్న కరోనా పేషెంట్లకు మళ్లీ కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని దక్షిణ కొరియాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అనుమానాలు వ్యక్తం చేసింది. సౌత్ కొరియాలో కరోనా నుంచి బయటపడి క్వారంటైన్లో ఉంటున్న 51 మంది పేషెంట్లకు మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు కరోనా సోకిన వారికి మరోసారి వైరస్ సోకుతున్న విషయాన్ని సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్కియాంగ్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు పదిహేను లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య లక్షకు చేరువైంది. అయితే వీరిలో కేవలం మూడు లక్షల మంది మాత్రమే రికవరీ అయ్యారు. అయితే నమోదైన కేసులతో పోల్చితే కోలుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.