Leading News Portal in Telugu

జూన్ 10 వరకు స్కూళ్లు బంద్… సీఎం సంచలన నిర్ణయం…

పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జూన్ 10 వరకు స్కూళ్లు మూసివేయాలని నిర్ణయంచారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీకి వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు మమతా బెనర్జీ. అయితే, లాక్ డౌన్ కొనసాగింపు అంశం మీద ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించినట్టు ముందుకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు. అయితే, స్కూళ్ల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 10 వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రకటించారు. విద్యార్థుల పరీక్షలు, ఇతర అంశాల మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు బెంగాల్లో లాక్ డౌన్ అమలు సరిగా జరగడం లేదంటూ కేంద్ర హోంశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమయంలో కూడా మత పరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇస్తున్నారంటూ అభ్యంతరం తెలిపింది. లాక్ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలంటూ డీజీపీని ఆదేశించింది.