ట్విట్టర్ వేదికగా తెగ తిట్టుకుంటున్న విజయసాయిరెడ్డి, నాగబాబు…
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జనసేన నేత నాగబాబు మధ్య ట్విట్టర్ వేదికగా ఫైట్ నడుస్తోంది. ఇద్దరూ పరస్పరం విమర్శలు గుప్పించుకుటున్నారు. పవన్ కళ్యాణ్ను పావలా బ్యాచ్ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానిస్తే, విజయసాయిరెడ్డిని శతకోటి గొట్టాల్లో ఓ గొట్టం అంటూ నాగబాబు ఎదురుదాడి చేశారు. అంతకు ముందు ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ప్రభుత్వం ఉద్వాసన పలకడంతో జనసేన అధినేత స్పందించారు. కరోనా సమయంలో ఎలాంటి రాజకీయ విమర్శలు చేయవద్దని అనుకున్నామని, అయితే, ఆ పరిస్థితిని వైసీపీనే కల్పించిందంటూ మండిపడ్డారు. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి అసలు రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండ్ ఉంటేగా? అంటూ పవన్ కళ్యాణ్ను ఎద్దేవా చేశారు.