ముంబై బంస్టాండ్లో వందలాది వలస కూలీల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జి
కరోనా కోరల్లో చిక్కుకున్న ముంబైలో వలస కార్మికులు ఆందోళన బాటపట్టారు. తమను స్వస్థలకు పంపించాలని పెద్ద ఎత్తున రోడ్ల మీదకు చేరుకున్నారు. బాంద్రా పశ్చిమ బస్ట్స్టేషన్ ముందు వందల సంఖ్యలో వలస కార్మికులు గుమిగూడారు. తమను ఇక్కడి నుంచి పంపించాలంటూ యూపీ, బీహార్, జార్ఖండ్కు చెందిన వలస కార్మికులు నినాదాలు చేశారు. పోలీసులు చేరుకొని వారిపై లాఠీచార్జి చేశారు. గుంపులు గుంపులుగా ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో.. వారిని చెదరగొట్టారు. వలస కూలీలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బస్టాండ్ పరిసరాలు, రోడ్లను శానిటైజ్ చేశారు అధికారులు. ఒక్కసారిగా అంతమంది కూలీలు రోడ్లమ మీదకు ఎలా వచ్చాచరన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.