కరోనా విలయతాండవంక్రైమ్ట్రెండింగ్బిజినెస్బిజినెస్ ఐడియాఅంతర్జాతీయంఆరోగ్యంటెక్నాలజీWin 1 Lakh – MC PRO Contest హోమ్ » న్యూస్ » కరోనా విలయతాండవం దేశంలో ఆగని కరోనా విజృంభణ… 24 గంటల్లో 991 కేసులు…
దేశంలో కేవలం 24 గంటల్లో 991 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ 24 గంటల్లో 43 మంది కరోనాతో చనిపోయారు. దీంతో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 480కు చేరింది. మొత్తంగా ఇప్పటివరకు 1992 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మొత్తం కేసుల్లో 4,291 కేసులకు మర్కజ్తో లింక్ ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 47 జిల్లాల్లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోందన వివరించింది. 45 జిల్లాల్లో 14 రోజుల నుంచి ఒక్క కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదు కాలేదని తెలిపింది.
మరోవైపు గుజరాత్లో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. దీంతో వెయ్యి కేసులు నమోదైన 6వ రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. ఇక 1707 కరోనా కేసులతో ఢిల్లీ రాష్ట్రంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇక 3,323 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.