కరోనా మహమ్మారిలోనూ సానిటైజర్లపై 18 శాతం జీఎస్టీనా…రాహుల్ గాంధీ చురక…
కరోనాపై దేశమంతా పోరాటం చేస్తున్న వేళ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే సానిటైజర్లు, మాస్కులు, సబ్బు ద్రావణంపై జీఎస్టీ తొలగించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సానిటైజర్లపై 18 శాతం, మాస్కులపై 5 శాతం, లిక్విడ్ హ్యాండ్ వాష్ పై 18 శాతం, డయాగ్నస్టిక్ టెస్ట్ కిట్స్ పై 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారని కేంద్రం వెంటనే స్పందించి వాటిని జీఎస్టీ పన్ను పరిధి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇచ్చి తక్షణం ఆదుకోవాలన్నారు . వలస కార్మికులతో పాటు వివిధ రంగాలను ఆదుకునేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా వెళ్లకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఈ సందర్భంగా రాహుల్ గుర్తుచేశారు. ఇక కరోనాపై పోరాడేందుకు ప్రధాని మోడీ మరిన్ని చర్యలు తీసుకోవాలన్న దీనికి అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాడాలని రాహుల్ అభిప్రాయపడ్డారు… అంతేకాకుండా కరోనా కట్టడికి భారత ప్రజల కూడా కలిసి పనిచేయాలని అన్నారు. కరోనాపై పోరులో కేరళ తీసుకున్న జాగ్రత్తలు అన్ని చోట్లా తీసుకోవాలని సూచించారు.