Leading News Portal in Telugu

ఢిల్లీలో 2వేలు దాటిన కరోనా కేసులు.. దేశవ్యాప్త గణాంకాలు ఇవే

భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1540 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్రవైద్యఆరోగ్యశాఖ తెలిపింది. మరో 36 మంది చనిపోయారిన తెలిపింది. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,656 కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ..2,851 మంది కోలుకున్నారు. మరో 559 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో 14,255 యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. ఢిల్లీలో 2003 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 45 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 4203 కేసులు నమోదవగా.. 223 మంది మరణించారు. గుజరాత్‌లో 1851 కరోనా కేసులుండగా.. 67 మంది చనిపోయారు.