Leading News Portal in Telugu

పురాణాల్లో కరోనాకు విరుగుడు… సైంటిస్టులకు గరికపాటి సూచన

కరోనాకు ప్రస్తుతానికి మందు లేదు. నివారణ ఒక్కటే మనముందున్న మార్గం. అమెరికా, యూకే, ఇండియా, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో కరోనా వాక్సిన్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే యూఎస్, యూకేలో హ్యూమన్ ట్రయల్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో కరోనా వ్యాధి, మందుకు సంబంధించి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా లాంటి వ్యాధి గురించి మన పురాణాల్లో ప్రస్తావించారని చెప్పారు. యోగా వాశిష్ట్యంలో దానికి సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయని ఓ టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూలో గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. యోగవాశిష్ట్యం.. అంటే శ్రీరాముడికి వశిష్టుడు చేిన బోధన. అది 32వేల శ్లోకాల గ్రంథం. అందులో ఉత్పత్తి ప్రకరణంలోని 69 సర్గలో విశూచిక అనే వ్యాధి గురించి చెప్పారు. దుర్భోజనం (రకరకాలను జంతు మాసాలను తినడం) ద్వారా వింత వ్యాధులు పుట్టుకొస్తాయి. అలాగే యుద్ధంలో ఎలాగైన గెలవాలన్న దుష్ట సంకల్పంతో కొందరు జీవాయుధాలు ప్రయోగంచాలని భావిస్తుంటారు. దుష్ట సంకల్ప కలిగిన ఉన్నవారి దగ్గర మొదలై.. యావత్ ప్రపంచం నాశనమయ్యే అవకాశం ఉందని వేల ఏళ్ల క్రితం రామాయణ కాలంలో చెప్పారు. అంతేకాదు కొన్నిసార్లు వ్యాధి లక్షణాలను గుర్తించడం కష్టమవుతుంది. ఐతే దానికి పరిష్కారం కూడా యోగ వాశిష్టంలో ఉందన్నారు గరికపాటి.