Leading News Portal in Telugu

గుడ్‌న్యూస్ .. సొంతూళ్లకు వెళ్లొచ్చు.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

లాక్‌డౌన్ వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొట్టకూటి కోసం పలు నగరాలకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. చేతిలో పనిలేక.. ఇక్కడే బతకలేక..నరకం చూస్తున్నారు. అలాంటి వారందరికీ కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వలస కార్మికులతో పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల చిక్కుకున్న పర్యాటకులు, విద్యార్థులు తమతమ సొంతూళ్లకు వెళ్లవచ్చని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు వారికి ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖరాసింది.