Rahul Gandhi Speech: మణిపూర్ హింసాకాండను ఆపడం ప్రభుత్వానికి ఇష్టం లేదు.. కేంద్రంపై రాహుల్ నిప్పులు.. – Telugu News | Rahul Gandhi Scathing Attack on BJP Government over the Ongoing Unrest in Manipur
Parliament No-Confidence Motion: పాదయాత్ర ప్రారంభించిన మొదట్లో తనకు అహంకారం ఉండేదని గుర్తుచేసుకున్నారు. పాదయాత్ర కొనసాగుతున్న కొద్దీ నాలో అహంకారం క్రమంగా మాయమైందన్నారు. పాదయాత్రలో రోజూ విభిన్న రంగాల వారిని కలిశాను.. సామాన్యులను, ధనవంతులను, వ్యాపారులను.. ఇలా అన్ని వర్గాలను కలిశాను. అందరితో కలుస్తూ.. అందరి మాటలు వింటూ పాదయాత్ర కొనసాగించా ..
మణిపూర్ హింసాకాండను దృష్టిలో ఉంచుకుని లోక్సభలో మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ వాడి వేడిగా సాగింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గందరగోళం మధ్యే రాహుల్ గాంధీ ప్రసంగం కొనసాగింది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లు భయపడాల్సిన అవసరం లేదంటూ వ్యంగ్యాస్త్రాలను సందించారు. అదానీ అంశంపై తాను ఈరోజు మాట్లాడను అంటూ మొదలు పెట్టారు. ఈరోజు హృదయంతో మాట్లాడతానునా.. ప్రసంగం గురించి బీజేపీ ఎంపీలు భయపడాల్సిన అవసరంలేదంటూ సెటైర్లు వేశారు. ముందుగా తన సభ్యత్వం పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు అంటూ మొదలు పెట్టారు.తన ప్రసంగం గురించి బీజేపీ ఎంపీలు భయపడాల్సిన అవసరంలేదు.. నా ప్రసంగంలో ఒకటి, రెండు తూటాలు పేలతాయంటూ ముందే అనడంతో బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు.
భయపడొద్దు.. ఇటీవల తాను దేశం ఒక మూల నుంచి మరో మూలకు పాదయాత్ర చేశానంటూ భారత్ జోడో యాత్ర గురించి చెప్పుకొచ్చారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నావని చాలామంది తనను ప్రశ్నించారని.. అయితే తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం వెనుక నా లక్ష్యం ఏంటని అడిగారు. భారత దేశాన్ని అర్థం చేసుకునేందుకు, ప్రజలకు కలిసేందుకు పాదయాత్ర చేయాలనుకున్నాను. నా పాదయాత్ర పూర్తి కాలేదు..
#WATCH | Congress MP Rahul Gandhi says, “Speaker Sir, first of all, I would like to thank you for reinstating me as an MP of the Lok Sabha. When I spoke the last time, perhaps I caused you trouble because I focussed on Adani – maybe your senior leader was pained…That pain might… pic.twitter.com/lBsGTKR9ia
— ANI (@ANI) August 9, 2023
ఇక ముందు కూడా కొనసాగుతుందన్నారు. పాదయాత్ర ప్రారంభించిన మొదట్లో తనకు అహంకారం ఉండేదని గుర్తుచేసుకున్నారు. పాదయాత్ర కొనసాగుతున్న కొద్దీ నాలో అహంకారం క్రమంగా మాయమైందన్నారు. పాదయాత్రలో రోజూ విభిన్న రంగాల వారిని కలిశాను.. సామాన్యులను, ధనవంతులను, వ్యాపారులను.. ఇలా అన్ని వర్గాలను కలిశాను. అందరితో కలుస్తూ.. అందరి మాటలు వింటూ పాదయాత్ర కొనసాగించా ..నేను నమ్మిన సత్యం కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు.
#WATCH | Congress MP Rahul Gandhi says, “A few days back, I went to Manipur. Our PM didn’t go, not even to this day, because for him Manipur is not India. I used the word ‘Manipur’ but the truth is that Manipur does not remain anymore. You have divided Manipur into two. You have… pic.twitter.com/QodCZnLHWs
— ANI (@ANI) August 9, 2023
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై గందరగోళంరాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకుంటున్న బీజేపీ సభ్యులు ప్రయత్నించారు. కొన్నిరోజుల క్రితం తాను మణిపుర్ వెళ్లినట్లుగా చెప్పారు. ప్రధాని మోదీ ఇప్పటి వరకు మణిపుర్ వెళ్లలేదన్నారు. మణిపుర్ పునరావాస శిబిరాల్లోని మహిళలు, పిల్లలతో తాను మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నట్లుగా చెప్పారు. మణిపుర్ బాధితులకు మద్దతుగా తాను రాత్రంతా వారితో గడిపానంటూ.. ఆ మహిళ చెప్పిన విషయాన్ని సభ ముందు పెట్టారు.
#WATCH | Congress MP Rahul Gandhi speaks on his Bharat Jodo Yatra; says, “…Initially, when I started (the Yatra), I had in my mind that walking 25 km is no big deal if I can run 10 km every day. Today, when I look at that – it was arrogance. I had arrogance in my heart at that… pic.twitter.com/QhFjtkZhLb
— ANI (@ANI) August 9, 2023
మన సైన్యం తలచుకుంటే మణిపుర్లో ఒక్కరోజులోనే శాంతి సాధ్యం..కానీ ప్రభుత్వం అలా ఆలోచించడం లేదంటూ విమర్శించారు రాహుల్ గాంధీ.
మరన్ని జాతీయ వార్తల కోసం