తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం | pilgrims rush in tirumala| devotees| 25 compartments| waiting| hundi| kanukalu
posted on Aug 28, 2023 10:16AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం శ్రీవారికి 79వేల 152 మంది దర్శించుకున్నారు. వారిలో 30వేల 329 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల రెండు లక్షల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు పాతిక కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.